News November 30, 2024
పవర్ను జన్మహక్కుగా భావించేవాళ్లు పదేళ్లుగా పవర్లో లేరు: మోదీ

ప్రతిపక్షాలు రాజ్యాంగ స్ఫూర్తిని నలిపేశాయని PM మోదీ అన్నారు. డెమోక్రసీలో అన్ని రూల్స్ను తిరస్కరిస్తూ, ప్రజల్ని మోసగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. ‘పవర్ తమ జన్మహక్కుగా భావించేవాళ్లు పదేళ్లుగా పవర్లో లేరు. ఆది నుంచీ వారు BJP-NDAకు ప్రజలిచ్చిన తీర్పును అంగీకరించడం లేదు. పదేళ్లుగా పవర్లో లేకపోవడంతో దేశంపై కుట్రలకు వెనుకాడటం లేదు’ అని పరోక్షంగా రాహుల్ను విమర్శించారు.
Similar News
News February 12, 2026
KCRను జైల్లో వేయొచ్చు కానీ…: CM రేవంత్

TG: కాళేశ్వరం కేసును CBIకి అప్పగించినా ఎందుకు విచారించడం లేదో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని CM రేవంత్ డిమాండ్ చేశారు. ‘NDSA రిపోర్టు ప్రకారం మేడిగడ్డలో నీరు నింపితే కొట్టుకుపోయే ప్రమాదముంది. అలా జరిగితే మా ప్రభుత్వంపై నిందలు వేయాలని BRS చూస్తోంది. KCRను జైల్లో వేయొచ్చు కానీ ప్రొసీజర్ ప్రకారం నడుస్తాను. నాకు సొంత రాజ్యాంగం లేదు’ అని CM ఢిల్లీలో పేర్కొన్నారు.
News February 12, 2026
నేను ట్యాపింగ్ చేయడం లేదు: రేవంత్ రెడ్డి

తాను ఎవరి ఫోన్లు ట్యాప్ చేయడం లేదని TG సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో స్పష్టం చేశారు. ‘ట్యాపింగ్ చేసి సంభాషణలు వింటే ఆయుష్షు తగ్గుతుంది. కాల్స్ వినడం ఓ మానసిక రోగం. SIB పేరిట రాజకీయ నేతలు, జర్నలిస్టులు, సినిమా వాళ్లు, బిజినెస్మెన్ల ఫోన్లు ట్యాప్ చేశారు. ప్రభుత్వం మారగానే హార్డ్వేర్లు మాయం చేశారు. KCR విచారణతో ఈ కేసు క్లైమాక్స్కు చేరిందని అనుకోవడం లేదు’ అని తెలిపారు.
News February 12, 2026
సింగరేణి నిబంధనలు మార్చింది కేంద్రమే: CM

TG: సింగరేణి టెండర్ల నిబంధనల్లో 2018లోనే కేంద్రం మార్పులు చేసిందని CM రేవంత్ స్పష్టం చేశారు. ‘సైట్ విజిట్ పర్మిషన్ తీసుకోవాలని అప్పుడే పెట్టారు. దీన్ని నిరూపిస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? సింగరేణే కాదు కోల్ ఇండియా కూడా నష్టాల్లో ఉంది. సింగరేణి సంస్థ జెన్కోకు కూడా బొగ్గు సరఫరా చేసింది. అమాయకుడిని కాబట్టి నాపై నిందలు వేస్తున్నారు. KCRను ఎందుకు అడగడం లేదు’ అని ప్రశ్నించారు.


