News November 14, 2024
ఇద్దరికి మించి పిల్లలున్న వారూ అర్హులే

AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News December 3, 2025
చెక్-ఇన్లో టెక్నికల్ గ్లిచ్.. విమానాలు ఆలస్యం

సాంకేతిక సమస్యల వల్ల విమానాల రాకపోకల్లో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా ఎయిర్పోర్టుల్లోని చెక్-ఇన్ వ్యవస్థలో టెక్నికల్ గ్లిచ్ వల్ల దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన విడుదల చేసింది. సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు శ్రమిస్తున్నట్లు పేర్కొంది. చెక్-ఇన్ ప్రాబ్లమ్తో ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు బారులుతీరారు. విమానాల ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 3, 2025
ప్రకటనే పవన్ సమాధానమా?

తెలంగాణకు పవన్ <<18446578>>క్షమాపణలు<<>> చెప్పాలన్న డిమాండ్ల నేపథ్యంలో జనసేన నుంచి వెలువడిన <<18451648>>ప్రకటన<<>> చర్చనీయాంశమైంది. ఇదే ఆయన సమాధానమా? ప్రత్యేకంగా మాట్లాడరా? ప్రకటనతో వివాదం ముగుస్తుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు Dy.CM హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతగా మాట్లాడాలని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. వివాదానికి ఆయన త్వరగా ముగింపు పలకాలని సూచిస్తున్నారు.
News December 3, 2025
VHTలో ఆడనున్న విరాట్ కోహ్లీ!

దేశవాళీ ODI టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ (VHT)లో ఆడేందుకు విరాట్ కోహ్లీ అంగీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రోహన్ జైట్లీ ధ్రువీకరించారని తెలిపింది. DEC 24 నుంచి జరగనున్న ఈ టోర్నీలో కోహ్లీ 3 మ్యాచుల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించే ఛాన్సుంది. దాదాపు 15ఏళ్ల తర్వాత ఆయన ఈ టోర్నీలో ఆడనున్నారు. అటు రోహిత్ శర్మ ముంబై తరఫున ఆడే అవకాశముంది.


