News November 14, 2024

ఇద్దరికి మించి పిల్లలున్న వారూ అర్హులే

image

AP: ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇకపై అర్హులే. దానికి సంబంధించిన నిబంధనకు సవరణ చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. అప్పట్లో కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. ఇప్పుడు సంతానోత్పత్తి తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News March 9, 2026

ఆస్తుల్లో ప్రశాంతిరెడ్డి టాప్

image

దేశవ్యాప్తంగా ఉన్న <<19333433>>మహిళా ప్రజాప్రతినిధుల్లో<<>> 14 మంది బిలియనీర్లు ఉన్నట్లు ADR వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తి విలువ రూ.8,234 కోట్లని తెలిపింది. ఏపీకి చెందిన కోవూరు TDP MLA వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ.716 కోట్లతో టాప్‌లో ఉన్నారు. APలోని 24 మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి రూ.74 కోట్లు, TGలోని 11 మంది నాయకురాళ్ల సగటు ఆస్తి రూ.14 కోట్లుగా పేర్కొంది.

News March 9, 2026

అలాంటి వీడియోలు ఫోన్‌లో సేవ్ చేసుకున్నా నేరమే: హైకోర్టు

image

చైల్డ్ పోర్నోగ్రఫీపై కర్ణాటక హైకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వీడియోలు, ఫొటోలను షేర్ చేయకపోయినప్పటికీ మొబైల్‌లో స్టోరేజీలో ఉన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 67B, పోక్సో యాక్ట్‌లోని సెక్షన్ 15 ప్రకారం నేరమేనని తేల్చిచెప్పింది. అవి కలిగి ఉండటం శిక్షార్హమని తెలిపింది. అశ్లీల వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకున్న వ్యక్తి తనపై నమోదైన కేసులను కొట్టేయాలన్న పిటిషన్‌ను తోసిపుచ్చింది.

News March 9, 2026

GREAT: 6 గంటలు శ్రమించి పులికి ఆపరేషన్ (PHOTOS)

image

పట్నా జూకు తరలించేందుకు సన్నాహాలు చేస్తుండగా ఢిల్లీ జూలోని ఏడాదిన్నర ఏళ్ల ‘దుర్గ’ అనే తెల్ల పులి రెండు కాళ్లు విరిగిపోయాయి. దీనికి ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ICAR) వైద్యులు అధునాతన ఆర్థోపెడిక్ పద్ధతులతో ఆపరేషన్ చేశారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ ఇన్‌స్టిట్యూట్‌లో ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారి అని ICAR దీనికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది.