News January 23, 2025
బాలీవుడ్ సెలబ్రిటీలకు పాక్ నుంచి బెదిరింపు మెయిల్స్!

బాలీవుడ్ సెలబ్రిటీలను చంపేస్తామంటూ మెయిల్స్ రావడం కలకలం సృష్టిస్తోంది. కమెడియన్ కపిల్ శర్మ, యాక్టర్ రాజ్పాల్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుంగధ మిశ్రాకు బుధవారం మెయిల్స్ వచ్చాయి. ‘మిమ్మల్ని గమనిస్తున్నాం. మాది పబ్లిక్ స్టంట్ కాదు. మీరు స్పందించకుంటే కఠిన చర్యలు తప్పవు’ అని అందులో బెదిరించారు. దీంతో వారు FIR నమోదు చేశారు. మెయిల్, IP అడ్రస్ను ట్రేస్ చేయగా పాక్ నుంచి వచ్చినట్టు తెలుస్తోంది.
Similar News
News February 16, 2025
విశాఖపట్నంలో ఐపీఎల్ మ్యాచులు!

IPL 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ తమ సెకండ్ హోంగ్రౌండ్ విశాఖపట్నంలో రెండు మ్యాచులు ఆడనుందని సమాచారం. DC తన మిగతా మ్యాచులను ఢిల్లీలోనే ఆడనుంది. మరోవైపు పంజాబ్ ధర్మశాలలో 3 మ్యాచులు ఆడుతుందని వార్తలు వస్తున్నాయి. సెకండ్ సెంటర్ కింద పంజాబ్ ఈ స్టేడియాన్ని ఎంచుకుంది. వచ్చే నెల 22 నుంచి IPL ప్రారంభమవుతుందని, తొలి మ్యాచ్ RCB vs KKR మధ్య ఉంటుందని సమాచారం.
News February 16, 2025
ప్లాస్టిక్ కంటైనర్లలో ఆహారం తింటున్నారా?

ప్రస్తుతం ఆన్లైన్, పార్సిల్లో వచ్చే ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లలో వస్తోంది. కానీ వీటిలో ఉంచిన ఆహారాన్ని తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో వేడి వేడి ఆహారం ఉంచడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ వెలువడతాయి. అవి మన శరీరంలోకి చేరి గట్ లైనింగ్ను నాశనం చేసి డీహైడ్రేటింగ్కు దారితీస్తాయి. పేగులను అనారోగ్యానికి గురి చేస్తాయి. గుండె జబ్బులు రావచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లో ఫుడ్ తినడం బెటర్.
News February 16, 2025
ఘజన్ఫర్ స్థానంలో ముంబైలోకి ముజీబ్

IPL: అఫ్గానిస్థాన్ ప్లేయర్ అల్లా ఘజన్ఫర్ స్థానంలో ముజీబ్ ఉర్ రహ్మాన్ను ముంబై జట్టులోకి తీసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్కు ఘజన్ఫర్ దూరమయ్యారు. గత ఏడాది జరిగిన వేలంలో రూ.4.8 కోట్లు వెచ్చించి ముంబై ఇతడిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈసారి MI స్పిన్నర్లు శాంట్నర్, ముజీబ్ ఎలా రాణిస్తారో చూడాలి.