News March 26, 2025
సూసైడ్ చేసుకుంటానని భర్తను బెదిరించడం క్రూరత్వమే: హైకోర్టు

సూసైడ్ చేసుకుంటానంటూ భర్తను, అతడి కుటుంబాన్ని భార్య బెదిరించడం క్రూరత్వం కిందికే వస్తుందని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. భార్య అలా చేస్తే భర్త విడాకులు తీసుకోవడంలో తప్పేం లేదని తేల్చిచెప్పింది. భార్య సూసైడ్ పేరిట తమ కుటుంబాన్ని వేధిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త దిగువ కోర్టులో విడాకులకు అప్లై చేశారు. కోర్టు మంజూరు చేయగా భార్య హైకోర్టుకెళ్లారు. ఆ కేసు విచారణలో ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చేసింది.
Similar News
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News July 11, 2025
ఫీజులు పెంచాలన్న అభ్యర్థనను తిరస్కరించిన HC

TG: ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఫీజులు పెంచాలన్న పలు కాలేజీల అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఫీజులు నిర్ణయించాలని ఫీజుల నియంత్రణ కమిటీని ఆదేశించింది. కమిటీ నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని కాలేజీలకు న్యాయస్థానం స్పష్టం చేసింది.