News May 26, 2024

ఆ వీడియో తర్వాత బెదిరింపులు పెరిగాయి: స్వాతి

image

తనపై యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఏకపక్షంగా చేసిన వీడియో తర్వాత బెదిరింపులు పెరిగాయని ఎంపీ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. <>వీడియో<<>>లో పలు అంశాలను ధ్రువ్ ప్రస్తావించలేదని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆప్ నేతలు ప్రచారం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలనే ఇదంతా చేస్తున్నారని పేర్కొన్నారు. తనకు వస్తున్న అత్యాచార, హత్యా బెదిరింపులపై ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News April 17, 2026

హీరోయిన్ పెళ్లి వార్తలు.. ఖండించిన తల్లి

image

మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్‌తో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి వార్తలను ఆమె తల్లి లిస్సీ ఖండించారు. వారి మ్యారేజ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ ఓ వ్యక్తి SMలో చేసిన కామెంట్‌కు ఆమె ‘ఫాల్స్ న్యూస్’ అని ఆన్సరిచ్చారు. 2022లో వచ్చిన హృదయం మూవీలో వీరిద్దరూ మ్యారీడ్ కపుల్‌గా నటించారు. ఆ సమయంలో ప్రేమ చిగురించిందని రూమర్లు వచ్చాయి. కాగా గతేడాది లోక: చాప్టర్-1తో కళ్యాణి సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

News April 17, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

image

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.

News April 17, 2026

ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

image

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.