News April 12, 2024
ఫోన్, గేమ్స్కు బానిసైన పిల్లలకు ముప్పు: పరిశోధన

స్మార్ట్ఫోన్స్, వీడియో గేమ్స్కు బానిసలైన పిల్లలకు భవిష్యత్తులో మానసిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కెనడా పరిశోధకులు వెల్లడించారు. వీరికి 23ఏళ్లు వచ్చేసరికి భ్రమ కలగడం, మతిస్థిమితం కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా టీనేజ్లో ఈ గేమింగ్కు అడిక్ట్ అయితే ఈ ప్రభావం 3-7% ఎక్కువ ఉంటుందట. స్మార్ట్ఫోన్ల వినియోగం తగ్గించకుంటే పేరెంట్స్-పిల్లల మధ్య బంధం సైతం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News March 15, 2025
‘రాబిన్హుడ్’లో డేవిడ్ వార్నర్ లుక్ చూశారా!

నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ‘రాబిన్హుడ్’ సినిమా ఈ నెల 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ లుక్ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేశారు ‘బౌండరీ నుంచి బాక్సాఫీస్కు వస్తున్న వార్నర్కు భారత సినిమా పరిశ్రమలోకి స్వాగతం’ అన్న ట్యాగ్లైన్ను పోస్టర్పై జత చేసింది. వార్నర్ లుక్ ఎలా ఉంది? కామెంట్ చేయండి.
News March 15, 2025
గవర్నర్ ప్రసంగాన్ని అవహేళన చేశారు: రేవంత్

TG: ప్రభుత్వ ఆలోచనలు, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలనే గవర్నర్ ప్రసంగంలో పొందుపరుస్తారని CM రేవంత్ అసెంబ్లీలో అన్నారు. ‘ఏ ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అది BRS సభ్యులకూ తెలుసు. అయినా గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కార్యకర్త ప్రసంగంలా ఉందని అవహేళన చేశారు. గతంలో మహిళా గవర్నర్ను అవమానించిన చరిత్ర వారిది’ అని విమర్శించారు. మరోవైపు KCRపై CM వ్యాఖ్యలను ఖండిస్తూ BRS సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
News March 15, 2025
బీఆర్ఎస్ వల్లే ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది: ఉత్తమ్

TG: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని, పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెరగడానికి కారణమే ఆ పార్టీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆరోపించారు. ‘ప్రగతిభవన్లో జగన్ మోహన్ రెడ్డితో కేసీఆర్ విందులు వినోదాలు చేసే సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మొదలుపెట్టారు. గత ప్రభుత్వ పదేళ్ల నిర్లక్ష్యం వల్ల శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తీసుకెళ్లింది’ అని ఉత్తమ్ మండిపడ్డారు.