News April 12, 2025

ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్‌లు పంపాడు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం.

Similar News

News November 11, 2025

రేపు కేంద్ర క్యాబినెట్ భేటీ

image

కేంద్ర క్యాబినెట్ రేపు సాయంత్రం 5.30 గంటలకు భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన ఢిల్లీ బ్లాస్ట్‌పై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

News November 11, 2025

దేశంలో భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్: అదానీ

image

దేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌(BESS)ను ఏర్పాటు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. గుజరాత్‌లోని ఖవ్డాలో నెలకొల్పుతున్న ఇది 2026 మార్చికి పూర్తవుతుందన్నారు. 1126 MW సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతుంది. 3 గంటలపాటు ఏకధాటిగా అంతే స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తుంది. 700 బ్యాటరీ కంటైనర్లను దీనిలో వినియోగిస్తారు. ఇది గ్రిడ్‌ను 24 గంటల పాటు స్థిరంగా ఉండేలా చూస్తుంది.

News November 11, 2025

రాష్ట్రమంతా చూస్తోంది.. ఓటేద్దాం పదండి!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ <<18256499>>శాతం<<>> నిరాశపరుస్తోంది. బస్తీల నుంచి పోలింగ్ బూత్‌లకు కొంతమేర ఓటర్లు వస్తున్నప్పటికీ ధనికులుండే కాలనీల వారు ఆసక్తి చూపడం లేదు. ఓటు వేయకుంటే అభివృద్ధి, సమస్యల గురించి ప్రశ్నించే హక్కు ఉండదని ప్రజలు గ్రహించట్లేదు. ఈ నిర్లక్ష్యం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు చెబుతున్నారు. యువతరం ఇప్పటికైనా మేల్కొని తమ పౌర బాధ్యతను నిర్వర్తించాలి. *ఓటేద్దాం పదండి