News April 12, 2025

ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు వచ్చాయి. తనకు డబ్బులు ఇవ్వాలని, లేకపోతే అంతు చూస్తానని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆమెకు మెసేజ్‌లు పంపాడు. దీంతో విజయశాంతి దంపతులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ గతంలో విజయశాంతి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహించినట్లు సమాచారం.

Similar News

News November 10, 2025

రబీ.. చౌడు నేలలకు అనుకూలమైన వరి రకాలు

image

☛ M.T.U 1293: సన్నగింజ రకం. పంట కాలం 120 రోజులు. చేనుపై పడిపోదు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. చౌడు నేలలకు అత్యంత అనుకూలం. దిగుబడి సాధారణ భూమిలో ఎకరాకు 3 టన్నులు, చౌడు భూమిలో 2.0-2.5 టన్నులు
☛ జగిత్యాల రైస్-1(JGL-24423): పంటకాలం 120-125 రోజులు. దొడ్డుగింజ రకం. దిగుబడి ఎకరాకు 30-35 క్వింటాళ్లు. ఆరుతడి, నేరుగా విత్తే పద్ధతులకు అనుకూలం. సుడిదోమను, చలి ఉద్ధృతిని, చౌడును కొంతమేర తట్టుకుంటుంది.

News November 10, 2025

శివాలయంలో ఇలా చేస్తున్నారా?

image

శివాలయంలో తెలియక మనం కొన్ని తప్పులు చేస్తుంటాం. అయితే కొన్ని నియమాలు పాటించాలని పండితులు సూచిస్తున్నారు.
1. నందీశ్వరుడికి, శివునికి మధ్య నడవకూడదు. ఎందుకంటే నంది చూపు శివుడిపై స్థిరంగా ఉండాలి.
2. శివలింగానికి ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు.
3. శివాలయంలో ప్రదక్షిణ నియమాలు వేరుగా ఉంటాయి. గుడి చుట్టూ తిరిగకూడదు. సోమసూత్రాన్ని దాటకుండా.. అక్కడి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం వద్దకు రావాలి.

News November 10, 2025

BIG ALERT: మరో తుఫాను.. మళ్లీ వర్షాలు!

image

AP: మొంథా తుఫాను విధ్వంసం నుంచి కోలుకోక ముందే రాష్ట్రాన్ని మరో ముప్పు వెంటాడుతోంది. ఈ నెల 19/20వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో వాతావరణ నిపుణులు వెల్లడించారు. ఇది తుఫానుగా బలపడి ఈనెల 25 నాటికి తీరం దాటొచ్చని, కోస్తా జిల్లాలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. అలాగే మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందని, దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు.