News March 16, 2024

బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ

image

AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్‌పర్సన్‌గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.

Similar News

News November 12, 2025

భారీ ఉగ్రకుట్ర.. భగ్నం చేసింది తెలుగోడే

image

జైషే మొహ్మద్ భారీ ఉగ్రదాడి కుట్ర భగ్నం చేసింది తెలుగు ఆఫీసర్ సందీప్ చక్రవర్తి. కర్నూలుకు చెందిన సందీప్ 2014 IPS ఆఫీసర్. చాలాకాలంగా కశ్మీర్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్లలో సమర్థంగా విధులు నిర్వర్తించి ఆరుసార్లు ప్రెసిడెంట్ మెడల్ పొందారు. గత నెలలో పలుచోట్ల జైషే పోస్టర్లు చూసి, CC కెమెరాల్లో పాత కేసు నిందితులు ముగ్గురిని గుర్తించి 2 వారాలు విచారించారు. దీంతో డాక్టర్ల భారీ టెర్రర్ ప్లాన్ బయటపడింది.

News November 12, 2025

బ్యాంకుకు ‘లంచ్ బ్రేక్’ ఉంటుందా?

image

బ్యాంకు సర్వీస్‌లో లంచ్ బ్రేక్ ఉండదు. RBI ప్రకారం పబ్లిక్, ప్రైవేట్ లేదా కోఆపరేటివ్ బ్యాంకుల్లో లంచ్ కోసం ఫిక్స్‌డ్ టైమ్ లేదు. భోజన సమయంలో కౌంటర్లన్నీ మూసివేయకూడదు. లంచ్‌ సమయంలోనూ ఎవరో ఒకరు రొటేషనల్ పద్ధతిలో కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లంచ్ బ్రేక్‌ పేరుతో ఇబ్బంది పడితే RBI కస్టమర్‌ కేర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఒకప్పుడు బ్యాంకుల్లో ఈ లంచ్ బ్రేక్ ఉండేది. SHARE

News November 12, 2025

ట్రాఫిక్‌లోనే 117 గంటల జీవితం

image

వాహనాల ట్రాఫిక్‌లో బెంగళూరు దేశంలోనే టాప్‌లో నిలిచింది. అక్కడ ఒక్కో ప్రయాణికుడు ఏడాదిలో సగటున 117 గంటలు ట్రాఫిక్‌లో గడుపుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాతి స్థానాల్లో కోల్‌కతా(110), పుణే(108), ముంబై(103), చెన్నై(94), హైదరాబాద్(85), జైపూర్(83), ఢిల్లీ(76), అహ్మదాబాద్(73) ఉన్నాయి. ఇక 10KM ప్రయాణానికి బెంగళూరులో 34ని.10 సెకన్లు పడుతుండగా, HYDలో 31ని.30 సెకన్లు పడుతున్నట్లు తేలింది.