News March 16, 2024
బొత్స కుటుంబం నుంచి ముగ్గురు పోటీ

AP: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల్లో మంచి పట్టున్న నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈసారి ఆయన కుటుంబం నుంచి YCP తరఫున ముగ్గురు బరిలోకి దిగుతున్నారు. బొత్స చీపురుపల్లిలో పోటీ చేస్తుండగా.. ఆయన తమ్ముడు అప్పలనర్సయ్య మరోసారి గజపతినగరంలో పోటీ చేస్తున్నారు. కీలకమైన విశాఖ MP సీటులో బొత్స సతీమణి ఝాన్సీలక్ష్మి బరిలో ఉన్నారు. గతంలో ఆమె జడ్పీ ఛైర్పర్సన్గా, బొబ్బిలి, విజయనగరం MPగాను పని చేశారు.
Similar News
News October 29, 2025
ఆ రూ.20 లక్షలు మాకొద్దు: బాధితురాలు

కరూర్ తొక్కిసలాట ఘటన బాధిత కుటుంబాల సహాయార్థం TVK చీఫ్ విజయ్ రూ.20 లక్షల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే మృతుల్లో ఒకరైన రమేశ్ భార్య సంఘవి ఆ డబ్బును తిప్పి పంపడం చర్చనీయాంశమైంది. ‘మాకీ డబ్బు ముఖ్యం కాదు. నేరుగా వచ్చి పరామర్శిస్తానని, ముందు డబ్బు తీసుకోమని చెప్పారు. ఆయన పరామర్శ కోసం ఎదురుచూశాం. చెన్నై సమావేశానికి వెళ్లేందుకు మేము నిరాకరిస్తే మా బంధువులను తీసుకెళ్లారు’ అని తెలిపారు.
News October 29, 2025
ప్యాడ్స్ వాడితే దద్దుర్లు వస్తున్నాయా?

పీరియడ్స్లో అమ్మాయిలు చాలా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ప్యాడ్స్ వాడటం వల్ల దద్దుర్లు, దురద వేధిస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే కాటన్ ప్యాడ్స్ వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. సెంటెడ్ ప్లాస్టిక్ పూత ఉన్న ప్యాడ్స్ వల్ల గాలి ప్రసరణ జరగక సమస్యలు వస్తాయంటున్నారు. అలాగే 4-6 గంటలకు ఓ సారి ప్యాడ్స్ మార్చాలి. మైల్డ్, సువాసన లేని సబ్బు, గోరువెచ్చని నీటితో వెజినాని క్లీన్ చేయడం వల్ల కూడా సమస్య అదుపులో ఉంటుంది.
News October 29, 2025
30 ఇంజినీర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 30 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు.. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.590, SC,ST,దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bel-india.in/


