News January 8, 2025

కుంభమేళాలో తిరుమల శ్రీవారి ఆలయం

image

UPలోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహాకుంభమేళాలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేయనున్నట్లు TTD ఈవో శ్యామలరావు తెలిపారు. JAN 13- FEB 26 వరకు కుంభమేళాకు వచ్చే కోట్లాది మందికి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తామన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని సెక్టార్ 6, బజరంగ్ దాస్ రోడ్డులోని నాగవాసుకి గుడికి సమీపంలో 2.89ఎకరాలలో ఆలయం నిర్మించనున్నట్లు చెప్పారు. సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్ని సేవలు జరుగుతాయని తెలిపారు.

Similar News

News January 16, 2025

హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు

image

ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

News January 16, 2025

కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్

image

హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.

News January 16, 2025

ఆరు వారాలే ఒప్పందం!

image

ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.