News December 17, 2024

తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్లు.. ఎప్పుడు, ఎక్కడ?

image

AP: తిరుమలలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉండనున్నాయి. దానికి సంబంధించిన టికెట్ల వివరాలు..
*DEC 23న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు శ్రీవాణి వీఐపీ టికెట్ల విడుదల
*DEC 24న ఆన్‌లైన్‌లో ఉ.11 గం.కు రూ.300 స్పెషల్ దర్శన టోకెన్ల విడుదల
*తిరుపతిలోని ఎం.ఆర్ పల్లి, జీవకోన, ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో SSD టోకెన్ల కేటాయింపు

Similar News

News September 20, 2025

2,569 మందికి కారుణ్య నియామకాలు: లోకేశ్

image

AP: రాష్ట్రంలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. మొత్తం 3,441 మంది నుంచి అప్లికేషన్స్ రాగా.. వారిలో 2,569 మందికి కారుణ్య నియామకాల కింద పోస్టింగులు ఇచ్చినట్లు వెల్లడించారు.

News September 20, 2025

ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: రాయలసీమలో ఇవాళ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశముందని APSDMA తెలిపింది. కర్నూలు, నంద్యాల, ATP, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు-భారీ వర్షాలు, శ్రీకాకుళం, VZM, అల్లూరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది. SEP 26న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని తెలిపింది.

News September 20, 2025

పాల ప్రొడక్టుల ధరలు తగ్గింపు

image

AP: GST తగ్గడంతో తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు సంగం, విజయ డెయిరీలు ప్రకటించాయి. సంగం డెయిరీ UHT పాలు లీటరుపై రూ.2, పనీర్ కిలో రూ.15, నెయ్యి-వెన్న కిలోకి రూ.30, బేకరి ప్రొడక్టులు కిలోపై రూ.20 మేర తగ్గించనుంది. విజయ డెయిరీ టెట్రాపాలు లీటరు రూ.5, ఫ్లేవర్డ్ మిల్క్ లీటరుకు రూ.5, పన్నీర్ కిలో రూ.20, వెన్న-నెయ్యిపై కిలోకి రూ.30 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు SEP 22 నుంచి అమలులోకొస్తాయి.