News December 6, 2024

తిరుపతి- సింగపూర్ విమాన సర్వీసులు స్టార్ట్

image

AP: తిరుపతి నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం 5గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థకు చెందిన తొలి ఫ్లైట్ రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరింది. శ్రీవారి దర్శనానికి విదేశాల నుంచి వచ్చేవారు ఇప్పటి వరకు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట రావాల్సి వచ్చేది. నేడు తిరుపతి నుంచి నేరుగా సింగపూర్‌కు విమాన సేవలు ప్రారంభం కావడంతో శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 17, 2025

‘పుష్ప’ నటుడికి అరుదైన వ్యాధి.. భార్య ఏమందంటే?

image

‘పుష్ప’ నటుడు ఫహాద్ ఫాజిల్ అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ ( ADHD) వ్యాధి సోకినట్లు గతంలో వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యాధిపై ఆయన భార్య నజ్రియా స్పందించారు. ‘ఆయన పరిస్థితి అర్థం చేసుకుని నేను కొంచెం ఓపిక పెంచుకున్నాను. అంతకుమించి మా జీవితంలో ఏమీ మారలేదు’ అని తెలిపారు. ఈ వ్యాధి కలిగిన వారు పరధ్యానం, చికాకు, చిన్నవాటికే కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తారు.

News January 17, 2025

హీరోపై దాడి.. నిందితుడి కోసం వేట, ఒకరి అరెస్టు

image

సైఫ్ అలీఖాన్‌పై కత్తి దాడి కేసు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడు చివరిసారిగా ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం వాసాయి-విరార్ వైపు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పోలీసు టీంలు వాసాయి, నల్లసోపారా, విరార్ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా సైఫ్ అలీఖాన్ లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News January 17, 2025

పంచాయతీ కార్యదర్శులకు షాక్!

image

TG: నల్గొండ(D)లో అనుమతి లేకుండా నెలల తరబడి విధులకు గైర్హాజరైన 99 మంది పంచాయతీ కార్యదర్శుల సర్వీసును జిల్లా కలెక్టర్ బ్రేక్ చేశారు. దీంతో గైర్హాజరైన కాలానికి సంబంధించిన సర్వీసును వారు కోల్పోనున్నారు. దీని వల్ల సర్వీస్ రెగ్యులరైజేషన్, ఇంక్రిమెంట్లు, పెన్షన్ల విషయంలో వారికి నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వీరిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. పాత స్థానాల్లో కాకుండా వేరే చోట పోస్టింగ్ ఇచ్చారు.