News June 2, 2024
అరుణాచల్ ప్రజలు పట్టం కట్టేదెవరికో?

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థులు లేక BJP ఇప్పటికే పది చోట్ల విజేతగా నిలిచింది. నేడు వెల్లడికానున్న మిగిలిన 50 స్థానాల ఫలితాలపైనా BJP ధీమాగా ఉంది. మరోవైపు నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 సీట్లలోనే పోటీకి పరిమితమైంది. పేపర్ లీక్స్తో ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా.
Similar News
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 2, 2025
ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్: కేంద్రం

గత ఐదేళ్లలో దేశంలో 2,04,268 ప్రైవేట్ కంపెనీలు మూతపడ్డాయని లోక్సభలో కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా వెల్లడించారు. విలీనాలు, రిజిస్ట్రేషన్ రద్దు వంటి రీజన్స్తో ఇవి క్లోజ్ అయ్యాయని తెలిపారు. అత్యధికంగా 2022-23లో 83,452, అత్యల్పంగా 2020-21లో 15,216 కంపెనీలు మూత పడ్డాయని పేర్కొన్నారు. ఆయా సంస్థల ఉద్యోగులకు పునరావాసం కల్పించే ప్రతిపాదన ప్రభుత్వానికి లేదని చెప్పారు.


