News August 30, 2024
నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు, Dy.CM పవన్

AP: వనం-మనం పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా నేడు పల్నాడు(D)లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కాకాని పంచాయతీ పరిధిలోని JNTUలో మొక్కలు నాటనున్నారు. వీరి రాక నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 10:30 గంటలకు పల్నాడుకు రానుండగా బహిరంగసభలోనూ ప్రసంగిస్తారు. అనంతరం 1:15 గంటలకి తిరుగు పయనమవుతారు.
Similar News
News February 7, 2026
తూర్పు, ఉత్తరం దిక్కులకే ప్రాధాన్యమెందుకు?

వాస్తు శాస్త్రంలో తూర్పు, ఉత్తర దిక్కులకు ప్రాధాన్యత ఇవ్వడం వెనుక బలమైన కారణాలున్నాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ‘ఎక్కువ మందికి వారి పేరు బలం, జన్మరాశి రీత్యా ఈ దిక్కులు బాగా కలిసివస్తాయి. ఇవి శుభ ఫలితాలను, లబ్ధిని చేకూరుస్తాయి. అనుభవజ్ఞులూ అదే చెబుతుంటారు. అందుకే ఇల్లు కొన్నా, కట్టినా, అద్దెకు తీసుకున్నా చాలామంది మొదట ఈ దిక్కులకే ప్రాముఖ్యతనిస్తారు’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 7, 2026
పాక్ గెలవలేదు.. మేమే ఓడిపోయాం: నెదర్లాండ్స్ బౌలర్ ఘాటు వ్యాఖ్యలు

T20 WCలో పాక్తో జరిగిన మ్యాచ్లో ఓటమిపై నెదర్లాండ్స్ పేసర్ పాల్ వాన్ మీకెరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పాకిస్థాన్ ఈ మ్యాచ్ గెలవలేదు. మేమే చేజేతులా ఓడిపోయాం’ అని అన్నారు. 148 పరుగుల టార్గెట్ ఛేదనలో పాక్ను కట్టడి చేసినా చివరి ఓవర్లలో ఎగ్జిక్యూషన్ లోపించిందని వాపోయారు. ముఖ్యంగా ఫహీమ్ అష్రఫ్ క్యాచ్ మిస్ చేయడం, డెత్ ఓవర్లలో భారీగా రన్స్ ఇవ్వడం తమ గెలుపును దూరం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 7, 2026
శుభవార్త చెప్పిన ప్రభుత్వం

APలోని టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఆర్థిక ఇబ్బందులతో తమ వాటా డబ్బులు చెల్లించలేక ఇళ్లు కట్టుకోలేని వారికి రుణాలు సమకూర్చనుంది. ఒక్కొక్కరికి ₹3.65 లక్షల చొప్పున 39వేల మందికి ₹1,423 కోట్లు అందించనుంది. ఈ రుణాన్ని 10.2-11.5% వడ్డీతో 15-20 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ ఏడాది జూన్కు 2.61 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.


