News September 20, 2024
TODAY HEAD LINES

➢ ఆ 3 కుటుంబాలు కశ్మీర్ను దోచుకున్నాయి: మోదీ
➢ AP: పవిత్ర తిరుమలను అపవిత్రం చేశారు: బాబు
➢ AP: వరద బాధితులకు అదానీ రూ.25 కోట్ల సాయం
➢ TG: MSMEలు భాగస్వామిగా ఉండాలి: CM
➢ AP: పవన్తో బాలినేని, సామినేని భేటీ
➢ AP: తిరుపతి లడ్డూ తయారీలో ఎద్దు కొవ్వు, చేప నూనె: NDDB రిపోర్టు
➢ TG: పోలీసుల అదుపులో జానీ మాస్టర్
➢ అశ్విన్ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
Similar News
News November 21, 2025
గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు పటిష్ట చర్యలు: కలెక్టర్

యువత భవిష్యత్తును అంధకారం చేసే గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పాఠశాల, కళాశాలలో పోస్టర్లు, సమావేశాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
News November 21, 2025
కృష్ణా జలాలపై జగన్ హెచ్చరిక

AP: కృష్ణా జలాల విషయంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితి ఏర్పడిందని YCP అధినేత YS జగన్ ట్వీట్ చేశారు. CM చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపైనే రాష్ట్ర హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. రాబోయే KWDT-II విచారణలో తెలంగాణ 763 TMCలను డిమాండ్ చేస్తోందని, బచావత్ ట్రైబ్యునల్ APకి కేటాయించిన 512 TMCల్లో ఒక్క చుక్కనూ కోల్పోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు.
News November 21, 2025
NPCILలో 122 పోస్టులు.. అప్లై చేశారా?

ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NPCIL) 122 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, MBA, ఇంజినీరింగ్ డిగ్రీ, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. వెబ్సైట్: https://npcilcareers.co.in


