News January 17, 2025
TODAY HEADLINES

✒ 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్
✒ సైఫ్ అలీ ఖాన్పై దుండగుడు కత్తితో దాడి
✒ పెన్&పేపర్ పద్ధతిలో NEET UG పరీక్ష
✒ ISRO.. SpaDeX విజయవంతం
✒ AP: నితీశ్కు రూ.25 లక్షల చెక్ ఇచ్చిన సీఎం
✒ 2047కి తలసరి ఆదాయం రూ.58.14L: CBN
✒ జూదాన్ని రాష్ట్ర క్రీడగా మార్చేశారు: YSRCP
✒ TG: నా నిజాయితీని నిరూపించుకుంటా: KTR
✒ TG: FEB 15 నుంచి బీసీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్
Similar News
News February 19, 2025
ఆరంభంలోనే పాకిస్థాన్కు ఎదురుదెబ్బ?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. కాగా ప్రేక్షకులు లేక కరాచీ స్టేడియం వెలవెలబోతోంది. గ్రౌండ్లో ఎక్కడ చూసినా ఖాళీ స్టాండ్స్ దర్శనమిస్తున్నాయి. టోర్నీ తొలి మ్యాచ్లోనే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో క్రికెట్ ప్రేమికులు పాకిస్థాన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇంత పెద్ద టోర్నీని చూసేందుకు పాక్ ఫ్యాన్స్ ఆసక్తి చూపడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు.
News February 19, 2025
మస్కిటో కాయిల్ ఎంత పని చేసింది!

AP: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో <<15497063>>అగ్నిప్రమాదం ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగు చూశాయి. మస్కిటో కాయిల్ వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. బెడ్ పక్కనే కాయిల్ పెట్టుకొని విద్యార్థి పడుకోవడంతో ఫ్యాన్ వేగానికి మంటలు చెలరేగినట్లు సమాచారం. ఈ క్రమంలో పొగ గది మొత్తం వ్యాపించడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. 70 మంది విద్యార్థులున్న గదికి ఒకటే ద్వారం ఉండటంతో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
News February 19, 2025
విజయవాడ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్-విజయవాడకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ మార్గంలో వెళ్లే లహరి-నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.