News March 7, 2025
TODAY HEADLINES

☛ తెలుగు ప్రజలకు రుణపడి ఉంటాను: చంద్రబాబు
☛ APకి ఏ లోటు లేకుండా చూస్తాం: నిర్మల
☛ బ్యాలెట్ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలి: జగన్
☛ SC వర్గీకరణ ముసాయిదా బిల్లుకు TG క్యాబినెట్ ఆమోదం
☛ రేవంత్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ BJPదే గెలుపు: KTR
☛ TG: ఈనెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ UKలో విదేశాంగ మంత్రి జైశంకర్పై దాడికి యత్నం
☛ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సునీల్ ఛెత్రి
Similar News
News March 12, 2026
క్రాష్ కంటిన్యూ.. 800 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ క్లోజ్

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు కోల్పోయి 76,034కు చేరగా.. నిఫ్టీ 227 పాయింట్ల నష్టంతో 23,639 వద్ద సెటిల్ అయింది. సెన్సెక్స్ టాప్ 30 సూచీలో NTPC, టెక్ మహీంద్రా, పవర్గ్రిడ్, HCL టెక్ మినహా ఇతర సూచీలన్నీ నష్టాలతోనే ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ధరల హైక్, భారత్ సహా 16 దేశాలపై ట్రేడ్ దర్యాప్తుకు ట్రంప్ ఆదేశించడం, FII సెల్లింగ్, రూపీ క్షీణత సూచీలపై ప్రభావం చూపించింది.
News March 12, 2026
సచిన్ను తప్పించాలనుకున్నాం: మాజీ సెలక్టర్

‘సచిన్ మీ ప్లాన్స్ ఏంటి? మిమ్మల్ని తప్పించి వేరే ప్లేయర్ను తీసుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పగానే టెండూల్కర్ షాకయ్యారని మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ తెలిపారు. ‘మీరు సీరియస్గానే అంటున్నారా?’ అని సచిన్ తిరిగి ప్రశ్నించగా అవునని సమాధానం ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. నిజానికి సచిన్ మరికొంత కాలం ఆడాలనుకున్నారని చెప్పారు. 2013లో రిటైర్మెంట్కు ముందు జరిగిన ఘటనలను పాటిల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
News March 12, 2026
15 నుంచి ఒంటిపూట బడులు.. జీవో జారీ

TG: ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభించాలని విద్యాశాఖ GO జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో APR 23 వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతాయని పేర్కొంది. ఉ.8 గంటల నుంచి మ.12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే 15న ఆదివారం కావడంతో సోమవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. బోర్డ్ ఎగ్జామ్స్ దృష్ట్యా 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కొనసాగుతాయని వెల్లడించింది.


