News April 13, 2025
TODAY HEADLINES

☛ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
☛ పాస్టర్ ప్రవీణ్ మృతిపై పోలీసుల కీలక ప్రకటన
☛ TGలో ఎల్లుండి నుంచి ‘భూ భారతి’ అమలు
☛ వనజీవి రామయ్య కన్నుమూత
☛ వక్ఫ్ చట్ట సవరణపై బెంగాల్లో అల్లర్లు.. 110 మంది అరెస్ట్
☛ దేశంలో ఉగ్రదాడులకు అవకాశం: నిఘా వర్గాలు
☛ UPI, వాట్సాప్ సేవల్లో అంతరాయం
☛ ప్రతీకార సుంకాలపై ట్రంప్ కీలక నిర్ణయం
☛ IPL: PBKSపై SRH విజయం.. అభిషేక్ శర్మ సెంచరీ
Similar News
News April 13, 2025
జావెలిన్ త్రోయర్పై నాలుగేళ్ల నిషేధం

భారత జావెలిన్ త్రోయర్ డీపీ మనుపై NADA నాలుగేళ్ల నిషేధం విధించింది. గతేడాది ఏప్రిల్లో జరిగిన గ్రాండ్ ప్రిక్స్-1 సందర్భంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించగా నిషేధిత పదార్థం వాడినట్లు తేలింది. ఆ పోటీల్లో మను విజేతగా నిలవడం గమనార్హం. అయితే డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అతడిపై నాడా తాత్కాలిక నిషేధం విధించింది. మనుపై 2028 వరకు నిషేధం కొనసాగించనున్నట్లు తాజాగా ప్రకటించింది.
News April 13, 2025
తహవూర్ రాణా అడిగిన వస్తువులు ఇవే..

అమెరికా నుంచి భారత్కు తీసుకొచ్చిన ముంబై పేలుళ్ల సూత్రదారి తహవూర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఈ కరుడుగట్టిన ఉగ్రవాదిని ఢిల్లీలోని NIA ఆఫీస్లో ఉంచి విచారిస్తున్నారు. ఈ సందర్భంగా అతడు పెన్ను, పేపర్లతో పాటు ఖురాన్ ఇవ్వాలని అధికారులను కోరారట. దీంతో వాటిని అందజేశారు. ఇతర ఖైదీల మాదిరిగానే రాణాని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం భారత్కు వచ్చిన రాణాకు ఢిల్లీ కోర్టు 18 రోజుల కస్టడీ విధించింది.
News April 13, 2025
ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య

AP: ఇంటర్లో <<16068539>>ఫెయిలయ్యామనే<<>> బాధలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. విశాఖ కొండపేటలో చరణ్తేజ్కు సెకండియర్ ఫిజిక్స్లో 10 మార్కులే రావడంతో ఉరివేసుకున్నాడు. ఫస్టియర్లో ఫెయిలవడంతో నంద్యాల(D) బండిఆత్మకూరులో చిన్నమస్తాన్, నెల్లూరు(D) చింతారెడ్డిపాలెంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. కర్నూలు(D) ఆదోనిలో 2 సబ్జెక్టులు ఫెయిలైన ఓ బాలిక ఫినాయిల్ తాగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటోంది.