News November 18, 2024

నేడు హైదరాబాద్‌లో ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్

image

నేడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారత్, మలేషియా జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది 10 మ్యాచుల్లో ఒక్క విజయం సాధించని భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18 3 టీవీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత్ 125, మలేషియా 133వ స్థానాల్లో ఉన్నాయి.

Similar News

News October 21, 2025

వరుసగా 4 వికెట్లు.. ఉత్కంఠ పోరులో శ్రీలంక విజయం

image

ఉమెన్స్ వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచులో శ్రీలంక 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు గెలిచే అవకాశం ఉన్నా చివర్లో 2 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా, తొలి 4 బంతుల్లో వరుసగా 4 వికెట్లు పడ్డాయి. దీంతో SLకు ఊహించని విజయం దక్కింది. అంతకుముందు శ్రీలంక 202 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమితో WC నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా BAN నిలిచింది.

News October 20, 2025

దర్శకుడిగా మారిన హీరో.. గుర్తుపట్టలేని విధంగా లుక్!

image

విశాల్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ‘మకుటం’ మూవీ నుంచి దీపావళి స్పెషల్ పోస్టర్ రిలీజైంది. ఇందులో విశాల్ సూట్ ధరించి తెల్లగడ్డం, కళ్లద్దాలతో గుర్తుపట్టలేని లుక్‌లో ఉన్నారు. ఈ మూవీతో తాను దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నానని, పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని విశాల్ తెలిపారు. దుషార విజయన్, అంజలి తదితరులు నటిస్తున్న ఈ మూవీని RB చౌదరి నిర్మిస్తుండగా, GV ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.

News October 20, 2025

రియాజ్ ఎన్‌కౌంటర్‌‌పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబం హర్షం

image

TG: రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంపై కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత ఆనందం వ్యక్తం చేశారు. పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్‌పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు. రియాజ్ <<18056853>>కత్తితో దాడి<<>> చేయడంతో కానిస్టేబుల్ ప్రమోద్ చనిపోయిన విషయం తెలిసిందే.