News November 18, 2024
నేడు హైదరాబాద్లో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్

నేడు హైదరాబాద్లోని గచ్చిబౌలిలో భారత్, మలేషియా జట్ల మధ్య ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది 10 మ్యాచుల్లో ఒక్క విజయం సాధించని భారత్ బోణీ కొట్టాలని చూస్తోంది. మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, స్పోర్ట్స్ 18 3 టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. ప్రస్తుతం ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ 125, మలేషియా 133వ స్థానాల్లో ఉన్నాయి.
Similar News
News March 9, 2026
OFFICIAL: ఇరాన్ సుప్రీం లీడర్గా మొజ్తాబా

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడు <<19299249>>మొజ్తాబా<<>> ఖమేనీ ఎన్నికైనట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. 88 మందితో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ బాడీ ఆయన్ను ఎన్నుకుంది. ఇరానియన్లు ఐక్యతను కాపాడుకోవాలని, మొజ్తాబా ఖమేనీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చింది. నిర్ణయాత్మక ఓటు ద్వారా ఆయన ఎన్నికైనట్లు సమాచారం. ప్రస్తుతం మొజ్తాబా వయసు 56 ఏళ్లు.
News March 9, 2026
యూట్యూబ్లోనే వీడియోలు, మెసేజ్లు పంపుకోవచ్చు!

యూట్యూబ్లో డైరెక్ట్ మెసేజింగ్ ఫీచర్ మళ్లీ రాబోతోంది. యాప్లోనే వీడియోలు, మెసేజ్లు పంపుకునేలా వెసులుబాటు కల్పించే ఈ ఫీచర్ను 2019లో కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు కొత్త వెర్షన్తో తీసుకురానుంది. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇతర యాప్లు అవసరం లేకుండానే యూట్యూబ్లోనే వీడియోలు, మెసేజ్లు పంపుకోవచ్చు. దీనితో పాటు షార్ట్స్ కోసం AI రీమిక్స్ ఫీచర్ కూడా రానుంది.
News March 9, 2026
భారత్ డామినేషన్.. 3 ఏళ్లలో 6 WCలు

గత 3 ఏళ్లలో భారత్ 6 క్రికెట్ వరల్డ్ కప్లు గెలిచింది. 2024 మెన్స్ టీ20 WC, 2025 ఉమెన్స్ U19 WC, 2025 ఉమెన్స్ ODI WC, 2025 బ్లైండ్ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్, 2026 మెన్స్ అండర్-19 WCతో పాటు తాజాగా మెన్స్ టీ20 వరల్డ్ కప్ను గెలుచుకుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. అన్ని జట్లను అభినందించారు. ఇది ఇండియన్ క్రికెట్కు గోల్డెన్ ఎరా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


