News January 1, 2025
ఇవాళ సెలవు
న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో ఇవాళ సెలవు ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఇచ్చారు.. అటు ఏపీలో జనవరి 1న పబ్లిక్ హాలిడే లేదు. ఆప్షనల్ హాలిడే కావడంతో కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. మిగతా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ యథావిధిగా పనిచేస్తాయి. ఇంతకీ ఇవాళ మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.
HAPPY NEW YEAR
Similar News
News January 15, 2025
40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు.. ఉక్రెయిన్పై దాడి పెంచిన రష్యా
ఉక్రెయిన్పై రష్యా మరో భారీ క్షిపణి దాడి చేసింది. 40కి పైగా క్షిపణులు, 70 డ్రోన్లు ఉపయోగించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ముందస్తు విద్యుత్ కోతలు అమలు చేసినట్టు తెలిపారు. ఉక్రెయిన్ సైన్యానికి యుద్ధంలో ఉపకరిస్తున్న గ్యాస్, ఎనర్జీ సదుపాయాలే లక్ష్యంగా రష్యా ఈ దాడి చేసింది. కాగా, ఉక్రెయిన్కు జర్మనీ మరో 60 Anti-Aircraft Missiles పంపనుంది.
News January 15, 2025
EX కానిస్టేబుల్ అక్రమాస్తులు రూ.500 కోట్లు.. భోపాల్లో పొలిటికల్ వార్
MP భోపాల్లో 2024 DEC 19న ఓ కార్ నుంచి 52KGల గోల్డ్, ₹10Cr నగదును IT అధికారులు సీజ్ చేశారు. ఈ మొత్తం RTO మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మదిగా గుర్తించి ఇంట్లో సోదాలు చేయగా ₹500-700Cr అక్రమాస్తులు బయటపడ్డాయి. పరారీలో ఉన్న అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. BJP ప్రభుత్వంలో అవినీతికి ఇదే నిదర్శనమని INC విమర్శిస్తోంది. అయితే 15 నెలల కమల్నాథ్ సర్కార్ కరప్షన్కు మారుపేరని కమల నేతలు కౌంటరిస్తున్నారు.
News January 15, 2025
‘కుంభమేళా’పై స్టీవ్ జాబ్స్ లేఖ.. వేలంలో రూ.4.32 కోట్లు
భారత్లో జరిగే మహాకుంభమేళా అంటే యాపిల్ కో ఫౌండర్, దివంగత స్టీవ్ జాబ్స్కు ఎంతో ఇష్టం. ఆయన 19 ఏళ్ల వయసు(1974)లో తన ఆధ్యాత్మిక, ఆత్మ పరిశీలనతోపాటు కుంభమేళాను సందర్శించాలనే ఆకాంక్షను ప్రస్తావిస్తూ స్నేహితుడు టిమ్ బ్రౌన్కు లేఖ రాశారు. తర్వాత స్టీవ్ భారత్లో దాదాపు 7 నెలలు గడిపారు. 50 ఏళ్ల కిందటి ఈ లెటర్ను వేలం వేయగా దాదాపు రూ.4.32 కోట్లు పలికింది. తాజాగా ఆయన సతీమణి పావెల్ కుంభమేళాకు వచ్చారు.