News March 14, 2025

ఇవాళ సెలవు

image

హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నేడు పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూతబడనున్నాయి. శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయి. ఏపీలో ఉ.7.45 నుంచి మ.12.30 వరకు, తెలంగాణలో ఉ.8 నుంచి మ.12.30 గంటల వరకు స్కూళ్లు నడుస్తాయి.

Similar News

News March 19, 2025

బైడెన్ మా ప్రతిపాదనలు స్వీకరించలేదు: మస్క్

image

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ క్షేమంగా భూమిపైకి చేరుకున్న నేపథ్యంలో స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలోనే సునీత, విల్మోర్‌ను భూమి‌పైకి తీసుకొచ్చేందుకు తాము చేసిన ప్రతిపాదనలను రాజకీయ కారణాలతో బైడెన్ స్వీకరించలేదని అన్నారు. ఆయన తమ సూచనలు తీసుకొని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిపైకి వచ్చేవారన్నారు. గతేడాది స్పేస్ షిప్‌లో సమస్యలు రావడంతో సునీత, విల్మోర్ రాక ఆలస్యమైంది.

News March 19, 2025

విద్యార్థులకు షాక్.. ఫీజులు భారీగా పెంపు

image

TG: పాలిటెక్నిక్ కోర్సు గరిష్ఠంగా రూ.39వేలకు పెరిగింది. దశాబ్ద కాలం నుంచి ఫీజుల పెంపు లేదని కాలేజీల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా రూ.40వేల వరకు వసూలు చేయవచ్చని హైకోర్టు పేర్కొంది. 2023-24 విద్యా సంవత్సరం నుంచే వర్తిస్తుందని పేర్కొంది. కాగా ప్రభుత్వం ఫీజు‌ రీయింబర్స్‌మెంట్ కింద రూ.14,900 చెల్లిస్తోంది. మరోవైపు నేటి నుంచి పాలిసెట్ <>అప్లికేషన్లు<<>> స్వీకరించనున్నారు. మే 13న ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది.

News March 19, 2025

ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్ ప్రధాని గల్లీ క్రికెట్

image

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వీధుల్లో అక్కడి పిల్లలతో క్రికెట్ ఆడుతూ సరదాగా గడిపారు. ఆయనతో పాటు కివీస్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్‌ కూడా ఉన్నారు. ఇండియా, న్యూజిలాండ్‌ను ఏకం చేయడంలో క్రికెట్‌ను మించినది లేదని క్రిస్టోఫర్ ట్వీట్ చేశారు.

error: Content is protected !!