News November 14, 2024
నేడు డయాబెటిస్ డే: ఈ జాగ్రత్తలు తీసుకోండి

రక్తంలో చక్కెరల/గ్లూకోజ్ను శరీరం ప్రాసెస్ చేయలేనప్పుడు డయాబెటిస్ వస్తుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం, చూపు కోల్పోవడం, కిడ్నీ సమస్యలు రావచ్చు. తరచూ దాహం, ఎక్కువగా మూత్రవిసర్జన, అలసట, బరువు తగ్గడం, పుండ్లు, చూపులో క్షీణత దీని లక్షణాలు. షుగర్ లెవెల్స్ ఎక్కువుండే ప్రాసెస్డ్ ఫుడ్, డ్రింక్స్ తీసుకోవద్దు. హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సొర, కాకర, ఆకుకూరలు, జొన్న, రాగులతో చక్కెర స్థాయులు తగ్గుతాయి.
Similar News
News April 14, 2026
సీఎం పదవికి నితీశ్ రాజీనామా

ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. రిజైన్ లెటర్ను గవర్నర్కు అందజేశారు. మరికాసేపట్లో బీజేపీ కొత్త సీఎం అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించనుంది. బిహార్కు నితీశ్ 21 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ రాష్ట్రంలో 243 అసెంబ్లీ సీట్లు ఉండగా NDAకు 202 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.
News April 14, 2026
PSL.. ముజరబానీపై రెండేళ్లపాటు నిషేధం

ZIM బౌలర్ ముజరబానీపై PSL రెండేళ్లపాటు నిషేధం విధించింది. PSLలో ఆడాల్సిన ఆయన, ఆ ఒప్పందాన్ని కాదని IPLలో ఆడేందుకు KKR జట్టులో చేరారు. ఇలా చేయడం ప్రొఫెషనలిజం కాదని, అందుకే వచ్చే 2 సీజన్లలో ఆడకుండా బ్యాన్ చేస్తున్నట్లు PSL ప్రకటించింది. MI ప్లేయర్ బాష్నూ గత సీజన్లో ఏడాదిపాటు నిషేధించింది. కాగా IPL కోసం PSL నుంచి తప్పుకున్న వారిలో శనక, స్పెన్సర్ జాన్సన్ కూడా ఉన్నారు. వారినీ బ్యాన్ చేసే ఛాన్సుంది.
News April 14, 2026
‘మహిళా బిల్లు’.. జగన్కు చంద్రబాబు లేఖ

మహిళా రిజర్వేషన్లపై కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టే ‘ నారీ శక్తి వందన్ అధినయం’ బిల్లుకు మద్దతివ్వాలని CM చంద్రబాబు YCP, JSP చీఫ్లు జగన్, పవన్ కళ్యాణ్ సహా అన్ని పార్టీల అధినేతలకు, MPలకు లేఖ రాశారు. చట్టసభల్లో మహిళలకు 3వ వంతు సీట్లు కల్పించాలన్న PM మోదీ సంకల్పాన్ని బలపరుద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో, పాలనలో మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని CBN అభిప్రాయపడ్డారు.


