News July 31, 2024

ITR దాఖలుకు నేడే చివరి తేదీ.. మిస్సయితే రూ.5వేలు ఫైన్

image

ఎలాంటి ఫైన్ లేకుండా ITR(FY24) దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది. మళ్లీ పొడిగించేది లేదని ఐటీ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. అపరాధ రుసుముతో డిసెంబర్ 31 వరకు రిటర్నులు ఫైల్ చేయొచ్చు. వార్షిక ఆదాయం రూ.5లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5వేలు, పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.వెయ్యి ఫైన్ కట్టాలి. అలాగే పన్ను మొత్తంపై వడ్డీ కూడా చెల్లించాలి. కాగా నిన్నటి వరకు 6 కోట్ల మంది ITR దాఖలు చేశారు.

Similar News

News November 27, 2025

ఇండోనేషియాలో భారీ భూకంపం

image

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తి, ప్రాణనష్టంపై వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నిన్న తీరాన్ని తాకిన సెన్యార్ తుఫాను వల్ల ఇండోనేషియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు, కొండ చరియలు విరిగిపడిన కారణంతో ఇప్పటికే 28 మంది మరణించారు.

News November 27, 2025

ధర్మేంద్ర మృతిపై హేమా మాలిని భావోద్వేగ పోస్ట్

image

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి తర్వాత ఆయన భార్య హేమామాలిని SMలో తొలి పోస్టు చేశారు. ఆయన మృతితో తన జీవితం శూన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర తనకు భర్త మాత్రమే కాకుండా.. స్నేహితుడు, మార్గదర్శి అని చెప్పారు. కుమార్తెలు ఈషా, అహానాపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర వినయం ఆయనను ఐకాన్‌గా నిలబెట్టిందని తెలిపారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీ జీవితాంతం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

News November 27, 2025

ధర్మేంద్ర మృతిపై హేమా మాలిని భావోద్వేగ పోస్ట్

image

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మృతి తర్వాత ఆయన భార్య హేమామాలిని SMలో తొలి పోస్టు చేశారు. ఆయన మృతితో తన జీవితం శూన్యమైందని భావోద్వేగానికి గురయ్యారు. ధర్మేంద్ర తనకు భర్త మాత్రమే కాకుండా.. స్నేహితుడు, మార్గదర్శి అని చెప్పారు. కుమార్తెలు ఈషా, అహానాపై ఆయన చూపిన ప్రేమను గుర్తుచేసుకున్నారు. ధర్మేంద్ర వినయం ఆయనను ఐకాన్‌గా నిలబెట్టిందని తెలిపారు. ఆయన మరణంతో ఏర్పడిన ఖాళీ జీవితాంతం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.