News March 31, 2024
స్కాలర్షిప్ దరఖాస్తుకు నేడు చివరి తేదీ
TG: SC, ST, BC, PWD విద్యార్థుల ప్రీమెట్రిక్ స్కాలర్షిప్కు దరఖాస్తు గడువు ఇవాళ్టితో ముగియనుంది. 5-10 తరగతులు చదువుతోన్న వారు 2024-25 విద్యాసంవత్సరానికి రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినందున మరో ఛాన్స్ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. స్కాలర్షిప్ రెన్యువల్ చేసుకోవాల్సిన వారికీ ఇదే చివరి అవకాశం.
రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం వెబ్సైట్: https://telanganaepass.cgg.gov.in/
Similar News
News October 6, 2024
హరియాణాలో మాదే అధికారం: సీఎం సైనీ
హరియాణాలో ఎగ్జిట్ పోల్స్ ప్రతికూలంగా ఉన్నప్పటికీ తిరిగి తామే అధికారంలోకి వస్తామని సీఎం నయబ్ సింగ్ సైనీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. తాము అన్ని రంగాల్లో పనులు చేశామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించారని పేర్కొన్నారు. హరియాణాను వారసత్వం, ప్రాంతీయతత్వం నుంచి వేరు చేసినట్లు పేర్కొన్నారు. కాగా 90 స్థానాలకు ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 6, 2024
తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారు: సినీ రచయిత
డబ్బింగ్ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టకుండా విడుదల చేసి తెలుగు ప్రేక్షకులని అగౌరవిస్తున్నారని సినీ రచయిత అబ్బూరి రవి ట్వీట్ చేశారు. ఇతర భాషా చిత్రాల గొప్పదనాన్ని, కళాత్మకతని తాను గౌరవిస్తానని తెలిపారు. తెలుగుని గౌరవించని వారి చిత్రాలను చూసేందుకు డబ్బులు ఖర్చుచేయడం గొప్పతనమని తాను అనుకోవట్లేదన్నారు. కాగా రజినీ ‘వేట్టయాన్’ మూవీ అదే పేరుతో తెలుగులో రిలీజ్ కానుండటం చర్చనీయాంశంగా మారింది.
News October 6, 2024
నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు
TG: సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూలు డిపో ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రూ.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీని ద్వారా 30వేల మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై నేతన్నలు హర్షం వ్యక్తం చేశారు.