News December 6, 2024
ఇవాళ SDRF ప్రారంభం

TG: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటు SDRF వాహనాలు, బోట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. 2 వేల మంది సిబ్బందితో ఏర్పాటయ్యే SDRF విపత్తుల సమయంలో బాధితుల రక్షణ కోసం సేవలు అందించనుంది. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.35.03 కోట్లను మంజూరు చేసింది.
Similar News
News December 19, 2025
భారత్ను రెచ్చగొట్టే ప్లాన్తోనే దాడి: బంగ్లాదేశ్ మాజీ మంత్రి

బంగ్లాదేశ్లో భారత డిప్యూటీ హై కమిషనర్ ఇంటిపై ప్లాన్ ప్రకారమే దాడి చేశారని హసీనా సర్కారులో విద్యా మంత్రిగా చేసిన మొహిబుల్ హసన్ చౌదరి ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలనే ఉద్దేశంతో మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న యూనస్ దేశంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. కింది స్థాయి పొలిటికల్ వర్కర్లను తొక్కేయాలని చూస్తున్నారన్నారు. భారత్ను రెచ్చగొట్టాలనే ఉద్దేశం కూడా దాడుల వెనుక ఉందని ఆరోపించారు.
News December 19, 2025
ఇవాళ, రేపు జాగ్రత్త

TG: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో ఇవాళ, రేపు సింగిల్ డిజిట్కు టెంపరేచర్లు చేరుతాయని అంచనా వేశారు. HYDలోని పలు ప్రాంతాల్లో 5-8 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. చలితీవ్రత పెరగనున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వచ్చే వారం ఇలాంటి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందన్నారు.
News December 19, 2025
ఎల్లుండి భారత్, పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్

U19 మెన్స్ ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ ఫైనల్కు చేరాయి. సెమీ ఫైనల్-1లో శ్రీలంకపై భారత్, సెమీస్-2లో బంగ్లాదేశ్పై పాక్ గెలిచాయి. ఈ నెల 21న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్-1లో తొలుత SL 138-8 స్కోర్ చేయగా, IND 18 ఓవర్లలో ఛేదించింది. ఆరోన్ జార్జ్ 58, విహాన్ 61 పరుగులతో రాణించారు. SF-2లో ఫస్ట్ BAN 121 రన్స్కు ఆలౌట్ కాగా, పాక్ 16.3 ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది.


