News December 6, 2024

ఇవాళ SDRF ప్రారంభం

image

TG: ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. దీంతో పాటు SDRF వాహనాలు, బోట్లనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. 2 వేల మంది సిబ్బందితో ఏర్పాటయ్యే SDRF విపత్తుల సమయంలో బాధితుల రక్షణ కోసం సేవలు అందించనుంది. దీని నిర్వహణ కోసం ప్రభుత్వం రూ.35.03 కోట్లను మంజూరు చేసింది.

Similar News

News January 7, 2026

రేపు వైకుంఠ ద్వారాలు మూసివేత

image

AP: తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను రేపు అర్ధరాత్రి ఏకాంత సేవ సమయంలో పండితులు మూసివేయనున్నారు. ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుంచి 10 రోజులపాటు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

News January 7, 2026

HYDకు 240 బస్సులేనా.. ఇదేం ప్లానింగ్?

image

AP: సంక్రాంతి సందర్భంగా 8,432 ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే పండుగకు ముందు హైదరాబాద్‌కు 240 బస్సులే కేటాయించడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి పండుగకు లక్షలాది మంది ఏపీకి వస్తారని, ప్రైవేటు ఆపరేటర్ల దోపిడీ ఉంటుందనే విషయం తెలిసీ ఇలా చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. వెంటనే అదనపు బస్సులను పెంచాలని కోరుతున్నారు. మీరేమంటారు?

News January 7, 2026

మొక్కజొన్నతో పాటు మిరప సాగు.. చైనా రైతుల వినూత్న ఆలోచన

image

చైనాలో రైతులు మొక్కజొన్న తోటల్లోని పొత్తుల్లో గింజలు రావడం మొదలవ్వగానే ఆకులను తొలగించి వాటి కింద మిరప మొక్కలను నాటుతుంటారు. మొక్కజొన్న పంట పూర్తవ్వగానే కాడలను వేళ్లతో సహా పీకేయకుండా సగం వరకు కత్తిరిస్తారు. దీని వల్ల అవి మిరప మొక్కలకు సహజ ఊతకర్రలుగా ఉండి, గాలులకు అవి పడకుండా రక్షణగా ఉంటాయి. ఇలా వారు ఒకేసారి రెండు పంటలను పండించి మంచి ఆదాయం పొందుతారు. దీన్నే ఇంటర్ క్రాపింగ్, realy క్రాపింగ్ అంటారు.