News April 11, 2024
నేడు బస్సుయాత్రకు సీఎం విరామం

AP: నేడు సీఎం జగన్ బస్సుయాత్రకు విరామమిచ్చారు. రంజాన్ సందర్భంగా ఆయన యాత్రకు విరామం తీసుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్లలోనే సీఎం బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Similar News
News January 7, 2026
అక్కడ బీజేపీ-MIM పొత్తు

అంబర్నాథ్(MH)లో BJP, కాంగ్రెస్ <<18786772>>పొత్తు<<>> దుమారం రేపగా, అకోలాలో BJP-MIM కలిసిపోవడం చర్చనీయాంశమవుతోంది. అకోలా మున్సిపల్ కౌన్సిల్లో 33 సీట్లకు ఎన్నికలు జరగ్గా BJP 11, కాంగ్రెస్ 6, MIM 5, మిగతా పార్టీలు 11 చోట్ల గెలిచాయి. ఈ క్రమంలో MIM, ఇతర పార్టీలతో కలిసి కూటమిని BJP స్థానిక యూనిట్ ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. అయితే MIMతో పొత్తును అంగీకరించబోమని CM ఫడణవీస్ స్పష్టం చేశారు.
News January 7, 2026
BCCIపై మొయిన్ అలీ పరోక్ష ఆరోపణలు

IPL నుంచి ముస్తాఫిజుర్ను <<18748860>>తప్పించడాన్ని<<>> ENG క్రికెటర్ మొయిన్ అలీ తప్పుబట్టారు. ‘ఎన్నో ఏళ్ల కష్టానికి అతనికి ఈ కాంట్రాక్టు దక్కింది. ఇలా తప్పించడంతో ఎక్కువగా నష్టం జరిగేది అతడికే. పాలిటిక్స్ క్రికెట్ను ప్రమాదంలో పడేస్తున్నాయి. దీనికి పరిష్కారం చూపాలి. ఇలాంటి సమస్యలపై AUS, ENG బోర్డులు ఎందుకు మాట్లాడవు. ICCని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో అందరికీ తెలుసు’ అంటూ BCCIపై పరోక్ష ఆరోపణలు చేశారు.
News January 7, 2026
తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈ ఉదయం పెరిగిన బంగారం ధరలు కాసేపటి క్రితం తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.550 తగ్గి రూ.1,38,270కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.500 పతనమై రూ.1,26,750 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,77,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


