News March 19, 2024
ఇవాళో, రేపో టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా?

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ లేదా రేపటిలోగా కొంతమంది పేర్లను ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటుండగా.. 10 మందికి చోటు దక్కే అవకాశం ఉంది. ఇప్పటికే 128 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ప్రకటించగా.. మరో 16 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై CBN సమాలోచనలు చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
విద్యార్థుల ఫోన్ నంబర్లకే EAPCET ఫలితాలు

TG: ఈఏపీసెట్ ఫలితాలను విద్యార్థుల ఫోన్ నంబర్లకే పంపాలని జేఎన్టీయూ అధికారులు నిర్ణయించారు. అప్లికేషన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న నంబర్కు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈనెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ, మే 2, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి 3.05 లక్షల మంది విద్యార్థులు EAPCET రాయనున్నారు. పరీక్షల అనంతరం 10 రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశముంది.
News April 21, 2025
త్వరలోనే బోనస్ డబ్బులు విడుదల: ఉత్తమ్

TG: పెండింగ్లో ఉన్న ధాన్యం బోనస్ డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో నిర్వహించిన రైతు మహోత్సవ సభలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కేంద్రం ప్రకటించిన పసుపు బోర్డు ఏమైందో స్థానిక బీజేపీ ఎంపీ అర్వింద్ చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి శాఖపై రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసినా అదనంగా ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదని విమర్శించారు.
News April 21, 2025
SMలో ఇన్వెస్ట్మెంట్ టిప్స్ అస్సలు నమ్మకండి: పోలీసులు

TG: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చని ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలను నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ‘ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లలో కనిపించే వీడియోలు, స్క్రీన్ షాట్లు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. ఫ్రీగా ట్రేడింగ్ క్లాసెస్ ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. ఎవరైనా లింక్ పంపించి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని కోరితే తిరస్కరించండి’ అని పోలీసులు ట్వీట్లో పేర్కొన్నారు.