News December 13, 2024
ఇబ్బందులెదుర్కొంటున్న టాలీవుడ్ ఫ్యామిలీస్
కాకతాళీయమో, దురదృష్టమో కానీ తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్ద కుటుంబాలు గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఎన్ కన్వెన్షన్ విషయంతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కినేని నాగార్జున కుటుంబం న్యాయపరంగా ముందుకెళ్తోంది. ఇక మంచు కుటుంబం సైతం అంతర్గత తగాదా, జర్నలిస్టుపై దాడి ఘటనల్లో చిక్కుకోగా తాజాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు కుటుంబానికి చెందిన అల్లు అర్జున్ సైతం అరెస్టయ్యారు.
Similar News
News January 16, 2025
రేపు ఓటీటీలోకి విడుదల-2?
వెట్రిమారన్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి, సూరి, మంజూ వారియర్ ప్రధానపాత్రల్లో నటించిన విడుదల-2 రేపు ఓటీటీలోకి రానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంటున్నాయి. ఓటీటీలో 3 గంటల 44 నిమిషాల నిడివితో మూవీ ఉంటుందని తెలుస్తోంది. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టలేకపోయినా వెట్రిమారన్ టేకింగ్, సేతుపతి నటన హైలైట్గా నిలిచాయి.
News January 16, 2025
విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం రూ.10వేల కోట్ల ప్యాకేజీ?
నష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దానికి ఫైనాన్షియల్ ప్యాకేజీ కింద రూ.10వేల కోట్లు ప్రకటించనున్నట్లు సమాచారం. దీనిపై ఇవాళ జరిగిన కేంద్ర క్యాబినెట్లో చర్చించిందని జాతీయ మీడియా పేర్కొంది. ఆర్థిక ప్యాకేజీపై రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
News January 16, 2025
మన స్టార్ క్రికెటర్లు చివరిగా రంజీలు ఎప్పుడు ఆడారంటే?
జూనియర్, సీనియర్ తేడా లేకుండా క్రికెటర్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలని BCCI స్పష్టం చేసింది. దీంతో కొందరు రంజీలకు సిద్ధమవగా, మరికొందరు ఇంకా స్పందించలేదు. ఈ క్రమంలో మన స్టార్ క్రికెటర్లు చివరిసారిగా రంజీ మ్యాచ్లు ఎప్పుడు ఆడారో తెలుసుకుందాం. కోహ్లీ(DEL)-2012, రోహిత్(MUM)-2015, బుమ్రా(GUJ)-2017, పంత్(DEL)-2018, రాహుల్(KAR)-2020, జడేజా(SAU)-2023.