News February 25, 2025
రేపు, ఎల్లుండి సెలవు

శివరాత్రి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అలాగే ఎల్లుండి గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికలు జరగనున్నాయి. దీంతో APలో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లకు ప్రత్యేక హాలిడే ఇవ్వాలని SEC ఆదేశించింది. TGలోని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ సెలవు ఉంటుంది.
Similar News
News February 25, 2025
ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని డిమాండ్

TG: ఈ నెల 27 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. 27న స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడంతో విద్యాసంస్థలు సిబ్బందికి సెలవు ఇవ్వడం లేదన్నారు. కొన్ని గంటలు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉద్యోగులకు ఏడాదిలో అందించే సెలవులతో సంబంధం లేకుండా పోలింగ్ రోజు సెలవు ఇవ్వాలని బండి విజ్ఞప్తి చేశారు.
News February 25, 2025
రోహిత్ను డిన్నర్ పార్టీ అడుగుతా: అక్షర్

బంగ్లాదేశ్తో మ్యాచ్లో రోహిత్ క్యాచ్ డ్రాప్ చేసి అక్షర్ హ్యాట్రిక్ మిస్ చేశారు. దీంతో డిన్నర్కు <<15528906>>తీసుకెళ్తానంటూ<<>> హిట్ మ్యాన్ ఇచ్చిన ఆఫర్పై ఆల్రౌండర్ స్పందించారు. ‘టీమ్ ఇప్పటికే సెమీస్కు క్వాలిఫై అయ్యింది. పైగా కివీస్తో తర్వాతి మ్యాచ్కు ఆరు రోజుల సమయం ఉంది. రోహిత్ను డిన్నర్ పార్టీ అడగడానికి ఛాన్స్ వచ్చింది’ అని పేర్కొన్నారు.
News February 25, 2025
ఆ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు

TG: సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ బోధించే స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్టుగా తెలుగు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. సింగిడి(స్టాండర్డ్ తెలుగు) స్థానంలో సులభతర తెలుగు వాచకం ‘వెన్నెల’ను 9, 10వ తరగతుల్లో బోధించాలని స్పష్టం చేసింది. 1-10 క్లాసుల వరకు తెలుగు బోధన, పరీక్షలు నిర్వహించాలని ఆయా బోర్డులను ఆదేశించింది. గత ప్రభుత్వం తెలుగును పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొంది.