News March 19, 2024
నీట్ దరఖాస్తులో సవరణలకు రేపే లాస్ట్

దేశవ్యాప్తంగా MBBS, BDS తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ దరఖాస్తులో సవరణలకు రేపు రాత్రి 11.59 వరకు అవకాశం ఉంది. అప్లై చేసినప్పుడు పొరపాట్లు చేసినవారు https://neet.nta.nic.in/లో లాగిన్ అయ్యి సరిదిద్దుకోవాలని అధికారులు సూచించారు. మే 5న మ.2 నుంచి సా.5.20 వరకు పరీక్ష జరగనుంది. ఈసారి దాదాపు 21 లక్షల మంది పరీక్షకు హాజరవుతారని అంచనా.
Similar News
News February 15, 2025
WPL: ఆర్సీబీకి కీలక ప్లేయర్ దూరం

గత సీజన్లో పర్పుల్ క్యాప్ విన్నర్గా నిలిచిన ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా ఈ సీజన్కు దూరమయ్యారు. ఈ విషయాన్ని ఆర్సీబీ Xలో వెల్లడించింది. ఆమె స్థానంలో స్నేహ్ రాణాను తీసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా నిన్న జరిగిన మ్యాచులో ఆర్సీబీ రికార్డు విజయం సాధించిన సంగతి తెలిసిందే.
News February 15, 2025
భారత క్రికెటర్లను హగ్ చేసుకోవద్దు: పాక్ అభిమానులు

ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో పాకిస్థాన్ ప్లేయర్లకు ఆ దేశ అభిమానులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 23న భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీతో పాటు టీమ్ ఇండియా క్రికెటర్లను హగ్ చేసుకోవద్దని సందేశాలు పంపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్, పాక్ మ్యాచ్ అనగానే ఇరుదేశాల అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంటుందన్న సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ వార్నింగ్ నేపథ్యంలో ఆటగాళ్లు ఏవిధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
News February 15, 2025
కులగణన.. రేపటి నుంచి వారికి మరో ఛాన్స్

TG: కులగణనలో పాల్గొనని 3,56,323 కుటుంబాల వివరాల నమోదుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. రేపటి నుంచి ఈ నెల 28 వరకు టోల్ఫ్రీ నంబర్ 040 21111111కు కాల్ చేస్తే ఎన్యుమరేటర్లు వారి ఇంటికెళ్లి వివరాలు సేకరిస్తారు. MPDO, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చు. https://seeepcsurvey.cgg.gov.in/ వెబ్సైట్లో సర్వే ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నింపి ప్రజాపాలన కేంద్రంలోనూ ఇవ్వొచ్చు.