News May 25, 2024

రేపే JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్.. నిమిషం లేటయినా నో ఎంట్రీ

image

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE అడ్వాన్స్‌డ్-2024 పరీక్ష ఆదివారం జరగనుంది. దేశ వ్యాప్తంగా 1.91 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఇందులో AP, TGకి చెందిన వారే 46వేల మంది ఉన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. బంగారు ఆభరణాలు, బూట్లు, డిజిటల్ పరికరాలను తీసుకెళ్లకూడదు. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. జూన్ 9న కీ, ఫలితాలను వెల్లడిస్తారు. 10 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

Similar News

News July 11, 2025

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఎంపీలకు 40% కోటా ఇవ్వాలి: రఘునందన్

image

సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు బహిరంగ లేఖ రాశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో ఎంపీలకు 40% కోటా కేటాయించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల లాగానే ఎంపీలు కూడా ప్రజలచే ఎంపికైన ప్రజాప్రతినిధులేనని, వారికి కూడా లబ్ధిదారుల ఎంపికలో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఎం గతంలో ఎంపీగా చేశారు కాబట్టి, ఎంపీల ప్రాధాన్యత గురించి ఆయనకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు.

News July 11, 2025

ఆస్పత్రిలో 2 గంటలున్నా ఇన్సూరెన్స్ క్లెయిమ్!

image

ప్రస్తుతం 2 గంటలు ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకున్నా కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా క్లెయిమ్ చేస్తున్నాయి. దీనిపై పాలసీ బజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ సిద్ధార్థ్ సింఘాల్ స్పందించారు. ‘గత పదేళ్లలో వైద్య రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. గతంలో కొన్ని ఆపరేషన్లకు చాలా సమయం పట్టేది. దీంతో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే 24 గంటలు పెట్టేది. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో 1-2 గంటలే పడుతుంది’ అని పేర్కొన్నారు.

News July 11, 2025

భారత వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్?

image

భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్‌కు గిల్ సారథ్యం వహిస్తారని రాసుకొచ్చాయి. అలాగే టీ20 వైస్ కెప్టెన్సీని కూడా అప్పగిస్తారని పేర్కొంటున్నాయి. దీనిపై ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మతో BCCI చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా గిల్ ప్రస్తుతం టెస్టు కెప్టెన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.