News November 12, 2024

యాసంగి నుంచి రైతులకు సబ్సిడీపై పనిముట్లు, యంత్రాలు

image

TG: యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. త్వరలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి అధికారులతో మంత్రి తుమ్మల సమీక్షించారు. ఎక్కువ డిమాండ్ ఉన్న పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా సిద్ధం చేశామని, మార్కెట్లలో కొత్తగా వచ్చిన పరికరాలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.

Similar News

News November 24, 2025

బీమా కంపెనీల విలీనం.. పార్లమెంటులో బిల్లు?

image

బ్యాంకుల తరహాలోనే ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల విలీన ప్రతిపాదన మళ్లీ తెరపైకి వచ్చింది. ఓరియంటల్, నేషనల్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లను ఒకే కంపెనీగా చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతారని తెలుస్తోంది. వాటిని ఆర్థికంగా మెరుగుపర్చడమే దీని ఉద్దేశం. 2018-19లో ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ మధ్యలోనే ఆగిపోయింది. అప్పట్లో వీటి బలోపేతానికి కేంద్రం ₹17450Cr కేటాయించింది.

News November 24, 2025

ఎయిమ్స్ కల్యాణి 172 పోస్టులకు నోటిఫికేషన్

image

పశ్చిమ బెంగాల్‌లోని <>ఎయిమ్స్ కల్యాణి <<>>172 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DNB, DM, MCH, MSc, M.biotech, M.Stat, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. డిసెంబర్ 26, 27 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in/

News November 24, 2025

తాంబూలం ఇలా ఇస్తేనే ఎక్కువ ఫలితం

image

☞ తమలపాకు చివర్లు, అరటి పండ్లు చివర్లు ఇచ్చేవారి వైపు ఉండకూడదు. లేకపోతే తాంబూలం ఇచ్చిన ఫలితం దక్కదని పండితులు చెబుతారు. ☞ తాంబూలంలో తమలపాకులు బేసి సంఖ్యలో ఉండేలా చూసుకోవాలి. 3, 5 ఆకులు ఇవ్వడం ఉత్తమం. ☞ తాంబూలంలో ఒకటి కన్నా ఎక్కువ పండ్లు పెట్టాలి. ☞ ఒకే రకానికి చెందిన ఒక్క పండు ఎప్పటికీ తాంబూలంలో పెట్టి ఇవ్వకూడదు. ☞ తాంబూలంలో దక్షిణ కూడా కచ్చితంగా ఉండాలి. అందుకే రూపాయి, 2 రూపాయల నాణేలు ఉంచాలి.