News February 27, 2025
ఇడ్లీ సాంబార్ వల్ల తగ్గిన టూరిజం: BJP MLA

గోవా బీచుల్లో ఎక్కడపడితే అక్కడ ఇడ్లీ సాంబార్, వడాపావ్ విక్రయించడం వల్ల విదేశీ టూరిస్టులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కలాంగూట్ బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పర్యాటకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల కూడా టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోందని, దీనికి అందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
Similar News
News October 13, 2025
పిల్లలకు వాడకూడని 3 వస్తువులు

మూడేళ్లలోపు పిల్లల శరీరం అతి సున్నితమైంది. కొందరు పేరెంట్స్ వారికి హార్డ్ బ్రష్తో పళ్లు తోముతుంటారు. ఇది వారి మృదువైన చిగుళ్లకు హాని కలిగిస్తుంది. ఇక స్నానం చేయించేటప్పుడు స్క్రబ్బర్తో రుద్దడాన్ని చిన్నారుల సున్నితమైన చర్మం తట్టుకోలేదు. తలస్నానం చేయించాక హెయిర్ డ్రయ్యర్ వినియోగం వల్ల వారి కుదుళ్లు దెబ్బతిని త్వరగా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా మీరు చేయిస్తున్నట్లయితే వెంటనే ఆపేయండి. SHARE IT
News October 13, 2025
LED స్క్రీన్లో వేములవాడ రాజన్న దర్శనం

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.
News October 13, 2025
‘భారత కెప్టెన్ను మార్చాలి’.. ఫ్యాన్స్ డిమాండ్

స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్పై భారత జట్టుతో పాటు ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ SA, AUSపై వరుస ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. గెలవాల్సిన మ్యాచ్ల్లో హర్మన్ కెప్టెన్సీ వల్లే ఓడిపోయామని ఫైరవుతున్నారు. బ్యాటింగ్లోనూ విఫలమవుతున్న తనను(21, 19, 9, 22) కెప్టెన్సీ నుంచి తొలగించాలని BCCIని డిమాండ్ చేస్తున్నారు. అటు IND సెమీస్కు వెళ్లాలంటే మిగతా 3 మ్యాచ్లూ కీలకం కానున్నాయి.