News February 27, 2025
ఇడ్లీ సాంబార్ వల్ల తగ్గిన టూరిజం: BJP MLA

గోవా బీచుల్లో ఎక్కడపడితే అక్కడ ఇడ్లీ సాంబార్, వడాపావ్ విక్రయించడం వల్ల విదేశీ టూరిస్టులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కలాంగూట్ బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పర్యాటకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల కూడా టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోందని, దీనికి అందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
Similar News
News March 24, 2025
విమానం లేటైనా, రద్దైనా టికెట్ డబ్బులు వాపస్..

విమాన ప్రయాణికుల ముఖ్యమైన <<15872009>>హక్కులు<<>> * షెడ్యూలుకు 2వారాల నుంచి 24hrs లోపు రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా డబ్బు పొందొచ్చు * అన్నీ సవ్యంగా ఉన్నా బోర్డింగ్ను నిరాకరిస్తే డబ్బు పొందొచ్చు * ఫ్లయిట్ 6hrs లేటైతే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా పరిహారం, భోజనం పొందొచ్చు. 24hrs అయితే వసతి పొందొచ్చు. * లగేజ్ పోతే KGకి ₹3K, డ్యామేజ్ అయితే ₹1K వరకు పొందొచ్చు * ప్రమాదంలో చనిపోతే/గాయపడితే ₹20L పరిహారం వస్తుంది.
News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.
News March 24, 2025
TTDలో హిందూయేతర ఉద్యోగుల తొలగింపు: BR

AP: 2025-26కు గాను ₹5,258Crతో TTD వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. TTDలో పనిచేసే హిందూయేతర ఉద్యోగుల తొలగింపుపై తీర్మానం చేసినట్లు తెలిపారు. జూపార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేట్ కట్టడాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకోసారి సుపథం దర్శనం కల్పిస్తామని, వృద్ధులు, వికలాంగులకు ఆఫ్లైన్లో దర్శన టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు.