News January 7, 2025
త్వరలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు: దుర్గేశ్
AP: త్వరలో విశాఖ, తిరుపతిలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించారు. సచివాలయంలో పర్యాటక పెట్టుబడులపై పర్యాటక శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సాధ్యాసాధ్యాలు చూసి ఆయా ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని సూచించారు. త్వరలో పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తానని అధికారులకు ఆయన చెప్పారు. అటు పర్యాటక ప్రదేశాల్లో పనుల పురోగతిపై ఆయన ఆరా తీశారు.
Similar News
News January 14, 2025
పసుపు బోర్డుతో రైతుల కల నెరవేరింది: బండి
TG: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో పండగ రోజు రైతుల కల నెరవేరిందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. దీని ద్వారా వారి జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నట్లు చెప్పారు. ఎంపీ అర్వింద్ పట్టుదలతో తన హామీ నెరవేర్చుకున్నారని చెప్పారు. రైతుల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి రైతులు తమ ఆశీర్వాదం అందించాలని బండి కోరారు.
News January 14, 2025
నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు: CBN
AP: మనదేశానికి జనాభే అతిపెద్ద ఆదాయ వనరు అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పా. కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెబుతున్నా. పిల్లలే మీ ఆస్తి. నలుగురు పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్టు. జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల్లో యువత లేక మనవాళ్లను అడుగుతున్నారు. ఇటీవల MP ప్రభుత్వం కూడా నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించింది’ అని CBN తెలిపారు.
News January 14, 2025
‘ప్లేయర్ ఆఫ్ ది డిసెంబర్’గా బుమ్రా
BGTలో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికైన స్టార్ బౌలర్ బుమ్రా మరో ఘనత సాధించారు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నారు.