News October 14, 2024
మిడిల్ క్లాస్ కోసం అమరావతిలో టౌన్షిప్స్

AP: మిడిల్ క్లాస్ కోసం అమరావతిలో మరిన్ని టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని CRDA భావిస్తోంది. మార్కెట్ కంటే తక్కువ ధరలకే ఫ్లాట్లు ఇచ్చేందుకు వీలుగా NTR ఎంఐజీ టౌన్షిప్లను నిర్మించనుంది. దీని కోసం ర్యాపిడ్ గ్రోత్ ఉండే వీజీటీఎం ఉడా పరిధిలోని భూములు, ప్రైవేట్ భూముల కోసం అన్వేషిస్తోంది. భూములిచ్చే రైతులకూ కొన్ని ఫ్లాట్లను ఇవ్వనుంది. ఇప్పటికే 4 టౌన్షిప్లకు వేలం వేయగా రూ.46.91 కోట్ల ఆదాయం వచ్చింది.
Similar News
News November 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.
News November 9, 2025
HCLలో 64 జూనియర్ మేనేజర్ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(<
News November 9, 2025
పాడి పశువుల కొనుగోళ్లు – ఈ జాగ్రత్తలతో మేలు

పాడి పశువును కొనే సమయానికి అది 2వ ఈతలో ఉండాలి. ఏ సమస్యా లేకుండా ఈనిన ఆరోగ్యమైన పశువును 15 రోజుల లోపు కొనుగోలు చేయాలి. ధరను పాల ఉత్పత్తిని బట్టి నిర్ణయించాలి. పశువును కొనేముందు మొదటిసారి తీసిన పాలను లెక్కలోకి తీసుకోకూడదు. రెండో రోజు ఉదయం, సాయంత్రం తీసిన పాలను లెక్కలోకి తీసుకోవాలి. లీటరు డబ్బాలతో పాలను కొలవాల్సి వస్తే పాలపై నురగని పూర్తిగా తీసివేయాలి. అన్ని పశువులను ఒకేసారి కొనకపోవడం మంచిది.


