News January 14, 2025

మహా కుంభమేళాలో విషాదం

image

మహా కుంభమేళాలో విషాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన NCP(SP) నేత, షోలాపూర్ మాజీ మేయర్ మహేశ్ కొతె గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఉదయం త్రివేణి సంగమం వద్ద నదిలో పవిత్ర స్నానం చేసేందుకు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుకు గురయ్యారు. గమనించి తోటి భక్తులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News January 26, 2026

అదనంగా మరో 50 వేల గ్రీన్ కార్డులు!

image

అగ్రరాజ్యం అమెరికా 75 దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్‌ను ఇటీవల <<18861240>>నిలిపివేసిన <<>>విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 2027లో గ్రీన్‌కార్డు కోటా పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ 175 దేశాలకు ఏడాదికి సుమారు 67 వేల ఇమిగ్రెంట్ వీసాలు జారీ అవుతాయి. అయితే ప్రాసెసింగ్ నిలిచిపోవడంతో వినియోగం కాని కోటా మిగిలే పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చే ఏడాదికి అదనంగా దాదాపు 50 వేల గ్రీన్‌కార్డులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

News January 26, 2026

THDCలో 100 అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, BE, B.Tech, BBA అర్హతగల అభ్యర్థులు జనవరి 31వరకు NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in

News January 26, 2026

పాల దంతాలకు జాగ్రత్తలు

image

పసి పిల్లలకు 7-9 నెలల వయసు నుంచి పాలదంతాలు వస్తాయి. ఈ సమయంలో తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పళ్లు రావడం మొదలయ్యాక మృదువైన బ్రష్‌తో వాటిని శుభ్రం చెయ్యాలి. దురద, నొప్పి రాకుండా శుభ్రమైన క్లాత్‌ని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి పిల్లలకు నోట్లో పెట్టుకోవడానికి ఇవ్వాలి. కొంతమందిలో ఈ దంతాలు వచ్చే సమయంలో జ్వరం, మోషన్స్ అవుతాయి. ఇవి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.