News August 14, 2025
J&Kలో విషాదం.. కల్చరల్, ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలు రద్దు

జమ్మూ కశ్మీర్లో <<17404381>>క్లౌడ్ బరస్ట్<<>> వల్ల ఇప్పటివరకు 30కి పైగా మరణాలు సంభవించాయి. వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఈ విషాదం కారణంగా రేపు సాయంత్రం జరగాల్సిన ‘ఎట్ హోమ్’ టీ పార్టీని రద్దు చేసినట్లు CM ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా రేపు జరగాల్సిన కల్చరల్ ప్రోగ్రామ్లనూ నిలిపివేయనున్నట్లు తెలిపారు. స్పీచ్, మార్చ్ ఫాస్ట్ వంటి అధికారిక కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.
Similar News
News August 14, 2025
అలాగైతే భారత్పై మరింత టారిఫ్స్: US హెచ్చరిక

భారత్పై టారిఫ్స్ను US మరింత పెంచవచ్చని ఆ దేశ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. అలస్కాలో శుక్రవారం జరిగే ట్రంప్-పుతిన్ భేటీ రిజల్ట్పై ఇది ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అంగీకరిస్తే టారిఫ్స్ పెంపు ఉండకపోవచ్చని, లేదంటే సుంకాలు పెంపు తప్పదన్నారు. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటోందని ఇప్పటికే INDపై US 25% అదనపు టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే.
News August 14, 2025
నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్: సీఎం

AP: నీటివనరుల సంరక్షణతోనే భూగర్భ జలాలు పెరుగుతాయని CM CBN అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో కరవును తరిమేయవచ్చని చెప్పారు. సాగునీటిశాఖలో ఇంజినీరింగ్ వ్యవస్థను రీస్ట్రక్చర్ చేస్తామని తెలిపారు. నీటి నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలని ఆ శాఖ సమీక్షలో CM అన్నారు. నీటి నిర్వహణపై జిల్లాలకు రేటింగ్ ఇస్తామని తెలిపారు. వెలిగొండ, గాలేరు నగరి సుజల స్రవంతిపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.
News August 14, 2025
SC తీర్పు ప్రజాస్వామ్య విజయం: మహేశ్ కుమార్

TG: బిహార్లో ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు <<17403517>>తీర్పు<<>> ప్రజాస్వామ్య విజయమని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. LoP రాహుల్ లేవనెత్తిన ఓటు చోరీ ఆరోపణ ఈ తీర్పుతో రుజువైందన్నారు. దీనిపై పార్లమెంట్లో చర్చకు పట్టుబట్టినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధార్ లింక్తో ‘ఒక ఓటు-ఒక మనిషి’ విధానం అమలు చేయాలన్న రాహుల్ డిమాండ్పై EC స్పందించాలని డిమాండ్ చేశారు.