News April 30, 2024
జడ్జి బదిలీ.. మళ్లీ మొదటి నుంచి సీఎం జగన్ కేసుల విచారణ

AP: సీబీఐ కోర్టులో CM జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. డిశ్చార్జి పిటిషన్లపై తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు నేటి వరకు గడువు ఇచ్చింది. ఈ సమయంలో జడ్జి రమేశ్ బాబు బదిలీ అయ్యారు. ఈయన 2022 మే నెల నుంచి 130 డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు వింటున్నారు. అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్లు అన్నింటిపై కొత్త జడ్జి మొదటి నుంచి వాదనలు విననున్నారు.
Similar News
News March 28, 2026
ట్రంప్-మోదీ ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ కాల్లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.
News March 28, 2026
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్ తాజా ఎయిర్ స్ట్రైక్స్లో ఇరాన్లోని అరాక్ హెవీ వాటర్ రియాక్టర్, అర్దకాన్ యురేనియం ప్లాంట్లను టార్గెట్ చేసింది. అణ్వాయుధాల తయారీకి అవసరమైన కీలక ఇన్ఫ్రాను ధ్వంసం చేయడమే లక్ష్యమని IDF వెల్లడించింది. ఈ అటాక్స్లో ఎటువంటి ప్రాణనష్టం, రేడియేషన్ ముప్పు లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అయితే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.
News March 28, 2026
మార్చి 28: చరిత్రలో ఈరోజు

1552: భారత సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: తెలుగు సినీ నటుడు చిత్తూరు నాగయ్య జననం (ఫొటోలో)
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి.వసంత జననం
1948: సినీ దర్శకుడు ఐ.వి.శశి జననం
1954: నటి మూన్ మూన్ సేన్ జననం
1962: భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు కోరాడ రామకృష్ణయ్య మరణం


