News February 3, 2025
గిరిజన శాఖను బ్రాహ్మణుడు/నాయుడికి ఇవ్వాలి: సురేశ్ గోపి

గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘గిరిజన కులాలకు చెందిన వ్యక్తే ఆ శాఖ మంత్రి అవుతున్నారు. ఇది దేశానికి శాపం. బ్రాహ్మణుడు/నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపడితే మార్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. కులాలపై కామెంట్లు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేరళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News November 27, 2025
NZB: జి.జి.కళాశాలలో కృత్రిమ మేధపై జాతీయ సదస్సు

స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో “కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉన్న అవకాశాలు & అవరోధాలు”అంశంపై జరుగుతున్న జాతీయ సదస్సును TU వైస్ ఛాన్స్లర్ ప్రొ. టి. యాదగిరి రావు, కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొ.ఆర్.సాయన్న, ప్రిన్సిపల్ డా.పి.రామ్మోహన్ రెడ్డి, సమన్వయకర్త రామకృష్ణ, ప్రారంభించి, సావనీర్ ఆవిష్కరించారు.
News November 27, 2025
పీరియడ్స్లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

పీరియడ్స్లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్స్మియర్, ఎండోమెట్రియల్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ స్కాన్, సోనోహిస్టరోగ్రామ్, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.
News November 27, 2025
మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


