News January 25, 2025

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్!

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు ట్యాప్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన పీఏ నిన్న విచారణకు హాజరయ్యారు. 2023 DECలో అధికార మార్పిడి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి 2023 OCTలో గవర్నర్‌గా నియమితులయ్యారు.

Similar News

News January 25, 2026

రథసప్తమి.. తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం

image

రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈరోజు మలయప్పస్వామి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు విభిన్న వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. సూర్యప్రభ నుంచి చంద్రప్రభ వరకు వాహన సేవలు కొనసాగనున్నాయి. నేడు ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు, VIP బ్రేక్ దర్శనాలను TTD రద్దు చేసింది. భక్తులకు 14 రకాల అన్నప్రసాదాలు పంపిణీ చేయనుంది. వరుస సెలవులతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఛాన్సుంది.

News January 25, 2026

బంగ్లాదేశ్‌కు అన్యాయం జరిగింది: నఖ్వీ

image

T20 WC నుంచి తప్పించి బంగ్లాదేశ్‌కు ICC అన్యాయం చేసిందని PCB ఛైర్మన్ మోషిన్ <<18947264>>నఖ్వీ<<>> అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ కోసం వెన్యూలు మార్చినప్పుడు బంగ్లాదేశ్ కోసం ఎందుకు మార్చరు? ఐసీసీని ఒకే దేశం డిక్టేట్ చేస్తోంది. ఐసీసీకి డబుల్ స్టాండర్డ్స్ ఉండకూడదు. ఓ దేశం కోసం నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. మరో దేశానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. అందుకే మేం బంగ్లాదేశ్‌కు మద్దతిస్తున్నాం’ అని తెలిపారు.

News January 25, 2026

వివేక్ ఆత్రేయతో రవితేజ సినిమా?

image

సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మాస్ మహరాజా రవితేజ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త తరహా కథలను తెరకెక్కించే వివేక్ ‘సరిపోదా శనివారం’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు. రజినీకాంత్, సూర్యకు ఆయన స్టోరీ వినిపించారని అంతకుముందు ప్రచారం జరిగింది. కానీ అవి ఓకే కాలేదని తెలుస్తోంది. కాగా రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు.