News January 25, 2025
త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ట్యాప్!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్లు గుర్తించారు. 2023 నవంబర్ 15 నుంచి 30 మధ్య 15 రోజుల పాటు ట్యాప్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఆయన పీఏ నిన్న విచారణకు హాజరయ్యారు. 2023 DECలో అధికార మార్పిడి తర్వాత ఫోన్ ట్యాపింగ్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ నేత అయిన ఇంద్రసేనా రెడ్డి 2023 OCTలో గవర్నర్గా నియమితులయ్యారు.
Similar News
News January 25, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 25, 2026
T20 WC నుంచి ఔట్.. BCB వివరణ ఇదే

T20 WC నుంచి వైదొలగడం అనేది తమ దేశ ప్రభుత్వ నిర్ణయమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ అమ్జద్ హొస్సేన్ తెలిపారు. ‘మేం ఆడాలనుకున్నాం. కానీ భారత్లో ఆడటం సేఫ్ కాదని ప్రభుత్వం వద్దని చెప్పింది. ప్రతి టూర్కు ప్రభుత్వ క్లియరెన్స్ తప్పనిసరి’ అని అమ్జద్ వివరించారు. ‘మ్యాచులు జరిగే ఓ సిటీ(కోల్కతా) నుంచి మాకు బెదిరింపులు వచ్చాయి. అందుకే అక్కడ ఆడటం సేఫ్ కాదని అనిపించింది’ అని పేర్కొన్నారు.
News January 25, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 25, ఆదివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.08 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.23 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


