News April 25, 2024
టెన్త్ టాపర్ ముఖంపై ట్రోల్స్.. బుద్ధి చెప్పిన అమ్మాయి
తన ముఖంపై నీచంగా ట్రోల్స్ చేస్తున్న వారికి బాలిక ప్రాచీ నిగమ్ బుద్ధి చెప్పారు. ట్రోలింగ్పై హుందాగా స్పందించారు. ‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు ఇలా ఎవరూ నా ముఖంపై కామెంట్స్ చేయలేదు. UPలో 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాక నా ఫొటో చూసి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. వాటన్నింటినీ పట్టించుకోను. అవాంఛిత రోమాల గురించి ఆలోచించట్లేదు. మార్కులే నాకు ముఖ్యం. ఇంజినీర్ కావడమే నా లక్ష్యం’ అని నిగమ్ తెలిపారు.
Similar News
News January 16, 2025
సంక్రాంతి సీజన్లో తొలిసారి.. అన్నీ రూ.100 కోట్ల క్లబ్లోనే!
సంక్రాంతి బరిలో నిలిచే అన్ని సినిమాలు హిట్ అవ్వవు. అలాగే కలెక్షన్లూ రాబట్టలేవు. కానీ, ఈ ఏడాది విడుదలైన సంక్రాంతి సినిమాల్లో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాలు ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్లో చేరగా నేడు వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఆ మార్క్ దాటనుంది. ఇలా సంక్రాంతి సీజన్లో అన్ని మూవీస్ రూ.100 కోట్ల మార్క్ను దాటడం మొదటిసారి కానుందని సినీవర్గాలు తెలిపాయి.
News January 16, 2025
BREAKING: సముద్రంలో మునిగి ముగ్గురు మృతి
AP: ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకల బీచ్లో విషాదం చోటుచేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు చనిపోగా, ఒకరిని జాలర్లు కాపాడారు. మరో వ్యక్తి కోసం మెరైన్ పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. మృతులను పొన్నలూరు మండలం తిమ్మపాలెం వాసులుగా గుర్తించారు. డెడ్ బాడీలను కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News January 16, 2025
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్: అశ్వినీ వైష్ణవ్
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్(NGLV) ద్వారా భారీ శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ఈ లాంచ్ప్యాడ్ ఉపయోగపడుతుందని వెల్లడించారు. అందుకు రూ.3,985 కోట్లు వెచ్చించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.