News April 10, 2025
ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికాను వీడాలంటే ఆందోళన

వలసదారులపై US అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న కఠిన వైఖరితో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం అమెరికాను విడిచి వెళ్తే తిరిగి రాలేమన్న భావన చాలా మందిలో ఉంది. స్వదేశం వెళ్దామనుకున్న చాలామంది భారతీయులు ఆ భయంతోనే ఇండియాకు రావాలంటే జంకుతున్నారు. అటు అక్కడి వీసా ఉన్న ఉద్యోగులు US వెలుపల ప్రయాణాలు పెట్టుకోవద్దని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి సంస్థలు అలర్ట్ చేశాయి.
Similar News
News April 18, 2025
పిల్లలను నరికి చంపి తల్లి ఆత్మహత్య.. కారణమిదేనా?

TG: నిన్న మేడ్చల్ (D) గాజులరామారంలో ఓ తల్లి ఇద్దరు పిల్లలను నరికి చంపి ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక విషయాలు తెలిశాయి. ఆశిష్(7), హర్షిత్(4)కి శ్వాసకోశ సమస్యలు ఉండటంతో ప్రతి 3, 4 గంటలకు ఒకసారి డ్రాప్స్ వేయాలి. దీంతో తేజస్విని మానసికంగా కుంగిపోయినట్లు సమాచారం. ‘మెరుగైన వైద్యానికి భర్త సహకరించట్లేదు. ఎంత ఆస్తి ఉన్నా పిల్లలకు పనికిరాకుండా పోతోంది. భర్త కోపంతో కసురుకుంటాడు’ అని సూసైడ్ నోట్ రాసింది.
News April 18, 2025
మూడు రోజుల్లో రూ.2400 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు స్వల్పంగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.250 పెరిగి రూ.89,450కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.97,580 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండిపై రూ.100 తగ్గి రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే తులం బంగారంపై రూ.2400 పెరగడం గమనార్హం.
News April 18, 2025
IPL: RCB vs PBKS మ్యాచ్కు వర్షం ముప్పు?

IPLలో నేడు బెంగళూరు వేదికగా RCB, PBKS తలపడనున్నాయి. అయితే, ఆ నగరంలో ఇవాళ ఓ మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. దీంతో మ్యాచ్కు ఆటంకం కలుగుతుందని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వరుణుడు అడ్డుపడకుంటే మ్యాచులో భారీ స్కోర్లు నమోదయ్యే ఛాన్సుంది. ఇప్పటి వరకు ఈ లీగ్లో ఈ రెండు జట్లు 33 సార్లు తలపడగా.. PBKS(17), RCB(16) మ్యాచుల్లో విజయం సాధించాయి.