News April 14, 2025

ట్రంప్ హత్య కోసం తల్లిదండ్రులను చంపేశాడు!

image

US విస్కాన్సిన్‌లో కసాప్(17) అనే కుర్రాడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు డబ్బు కోసం కన్నతల్లి, సవతి తండ్రిని కాల్చి చంపినట్లు FBI వెల్లడించింది. FEB 11న హత్యలు చేయగా.. తాజాగా ఈ కుట్రకోణం వెలుగు చూసింది. మారణకాండ సృష్టించేందుకు డ్రోన్, పేలుడు పదార్థాలు కొనే ప్రయత్నాలూ చేశాడట. రష్యాలోని ఓ వ్యక్తితో టచ్‌లో ఉన్నాడని.. అతని ఫోన్లో హిట్లర్ ఫొటోలు, జాతి విద్వేష భావజాలాన్ని గుర్తించినట్లు తెలిపింది.

Similar News

News March 11, 2026

మినిమం డిపాజిట్ చేయకపోతే అకౌంట్లు ఇనాక్టివ్!

image

మార్చి 31తో ఆర్థిక సంవత్సరం (2025-26) ముగియనుంది. మీ PPF, SSY (సుకన్య సమృద్ధి), NPS ఖాతాలు యాక్టివ్‌గా ఉండాలంటే ఆలోపు కనీస డిపాజిట్లు (PPF-₹500, SSY-₹250, NPS-₹1,000) చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ చేయలేకపోతే ఆ ఖాతాలు ‘ఇనాక్టివ్‌’ స్టేటస్‌లోకి వెళ్తాయి. వీటిని తిరిగి యాక్టివేట్ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా మిస్ అవుతారు.

News March 11, 2026

వివేకా హత్య కేసు.. సునీత పిటిషన్ల కొట్టివేత

image

AP: దివంగత ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీతా రెడ్డికి చుక్కెదురైంది. ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సహా పలువురి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ త్వరగా పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును SC ఆదేశించింది.

News March 11, 2026

వరల్డ్ కప్ గెలిచాక ట్రైన్‌లో ముంబైకి వెళ్లిన దూబే

image

ప్రపంచ కప్ గెలిచామన్న సంతోషం ఓ వైపు. ఈ మధుర క్షణాలను పిల్లలతో పంచుకోవాలనే ఆరాటం మరో వైపు. అదే సమయంలో విమాన టికెట్స్ దొరక్కపోవడంతో టీమ్ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే తన భార్యతో కలిసి రైలులో థర్డ్ ఏసీ కోచ్‌లో అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రయాణించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్, క్యాప్ ధరించి పై బెర్త్‌పై పడుకుని సొంతూరుకు చేరుకున్నారు.