News April 14, 2025
వీసాకోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ట్రంప్ షాక్

అమెరికాలో హెచ్-1బీ వీసా, గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. EB-5 అన్రిజర్వ్డ్ విభాగంలోని భారత అప్లికెంట్లకు అర్హత సమయాన్ని ఆరు నెలలకు కుదించారు. చైనీయులకు కటాఫ్ డేట్ మార్చని యంత్రాంగం, భారతీయులకు మాత్రం 2019 నవంబరు 1 నుంచి 2019 మే 1కి కుదించింది. దీంతో గ్రీన్ కార్డ్ లేదా హెచ్-1బీ వీసాకు అప్లై చేసుకునేవారికి అది లభించే అవకాశం మరింత సన్నగిల్లనుంది.
Similar News
News April 25, 2025
45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

TG: రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ADLB, నిర్మల్, MNCLలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా NZMBలోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
News April 25, 2025
ఇవాళ CSKvsSRH.. ఓడిన జట్టు ఖేల్ ఖతం

పాయింట్ల పట్టికలో చివరి స్థానం కోసం పోటీ పడుతున్న SRH, CSK మధ్య ఇవాళ సా.7.30కు కీలక మ్యాచ్ జరగనుంది. ఓడిన జట్టుకు ప్లేఆఫ్స్ ఛాన్స్ సన్నగిల్లుతుంది. 2 టీమ్స్ బ్యాటింగ్, బౌలింగ్ లోపాలతో ఇబ్బందిపడుతున్నాయి. హోంగ్రౌండులో ఆడుతుండటం CSKకు కలిసొచ్చే అంశం. ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్ చూపాలని CSK, కాటేరమ్మను గుర్తుతెచ్చుకుని అదరగొట్టాలని SRH అభిమానులు కోరుకుంటున్నారు. ఇవాళ ఏ జట్టు గెలుస్తుంది? మీ కామెంట్
News April 25, 2025
BRS సభకు వెళ్లకండి: RTC జేఏసీ

TG: తమ హయాంలో RTC కార్మికులకు అన్యాయం చేసిన BRS ఇప్పుడు వారిని పార్టీ సభకు రావాలని ఎలా పిలుస్తోందని RTC జేఏసీ ఛైర్మన్ అశ్వత్థామ రెడ్డి ఫైరయ్యారు. కార్మికులు 55రోజులు సమ్మె చేస్తే 34మంది ప్రాణాలు కోల్పోయారని ఆ విషయాన్ని ఉద్యోగులు మర్చిపోలేదన్నారు. 10ఏళ్ల పాలనలో ఒక్క రిక్రూట్ మెంట్ లేదని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగే BRS సభకు కార్మికులెవరూ వెళ్లొద్దని జేఎసీ నేతలు సూచించారు.