News February 6, 2025
మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లపై నిషేధం.. ట్రంప్ సంతకం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738807425622_1045-normal-WIFI.webp)
మహిళల క్రీడల్లో ట్రాన్స్జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. మహిళల క్రీడలపై జరుగుతున్న యుద్ధం ఈ ఆదేశాలతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘మహిళా అథ్లెట్ల సంప్రదాయాన్ని మేం రక్షిస్తాం. వారి క్రీడల్లోకి పురుషులు ప్రవేశించి, వారిని కొట్టడాన్ని అడ్డుకుంటాం. ఇక నుంచీ స్త్రీల క్రీడలు స్త్రీలకు మాత్రమే’ అని స్పష్టం చేశారు.
Similar News
News February 6, 2025
జగన్ ఇంటి వద్ద అగ్నిప్రమాదం.. TDP సంచలన ట్వీట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738818443904_653-normal-WIFI.webp)
AP: లిక్కర్ స్కాంపై ఉదయం సిట్ పడగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటని TDP ప్రశ్నించింది. ‘సిట్ తనవరకు వస్తుందని స్కాంకి సంబంధించి రాసుకున్న డాక్యుమెంట్లు తగలబెట్టారా? నిన్న సాయంత్రం జరిగితే ఇంకా CC ఫుటేజీ ఎందుకు బయటపెట్టలేదు? తానే తగలబెట్టి ప్రభుత్వంపై తోసేయడమేనా 2.0? ఎన్ని కుట్రలు చేసినా సిట్ వస్తుంది గెట్ రెడీ. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్’ అని ట్వీట్ చేసింది.
News February 6, 2025
అందుకే సాయి పల్లవిని ‘తండేల్’కు తీసుకున్నాం: అల్లు అరవింద్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738812724712_1045-normal-WIFI.webp)
తండేల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవి వంద శాతం న్యాయం చేశారని నిర్మాత అల్లు అరవింద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సాయి పల్లవిని హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసింది నేనే. ముంబై నుంచి వచ్చే అమ్మాయిలు ఈ పాత్రకు న్యాయం చేయలేరని నాకు అనిపించింది. ఎన్నో భావోద్వేగాల్ని పండించాల్సిన పాత్ర కావడంతో సాయి పల్లవే సరైన ఛాయిస్ అని ఆమెను తీసుకున్నాం. ఈ పాత్ర ప్రేక్షకులకు చాలాకాలం గుర్తుండిపోతుంది’ అని కొనియాడారు.
News February 6, 2025
పాక్పై ఓడితే గుచ్చి గుచ్చి అడుగుతారు: రవి శాస్త్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738815060817_1045-normal-WIFI.webp)
భారత్-పాక్ మ్యాచ్ ప్రత్యేకమేమీ కాదని, అన్ని మ్యాచుల్లాగే దాన్నీ పరిగణిస్తామన్న కోచ్ గంభీర్ వ్యాఖ్యలపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘కోచ్గా ఉన్నప్పుడు నేనూ మీడియాకు ఇదే మాట చెప్పేవాడిని. కానీ నిజమేంటంటే పాక్పై గెలవడం చాలా కీలకం. ఆ జట్టుపై ఎన్ని మ్యాచులు గెలిచినా ఒక్క మ్యాచ్ ఓడితే చాలు పాతవన్నీ మర్చిపోయి ఓటమి గురించే అందరూ గుచ్చి గుచ్చి అడుగుతారు’ అని వ్యాఖ్యానించారు.