News February 10, 2025
ట్రంప్ టారిఫ్స్: రూపాయి ఆల్టైమ్ కనిష్ఠానికి ఢమాల్

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఎమర్జింగ్ మార్కెట్ల కరెన్సీలు కుదేలవుతున్నాయి. నేడు డాలర్తో పోలిస్తే రూపాయి 87.9563 వద్ద జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఉదయం 87.9175 వద్ద ఓపెనైన రూపాయి ప్రస్తుతం 87.8240 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్ ఇండెక్స్ 108.266 వద్ద జోరు ప్రదర్శిస్తోంది. తాము దిగుమతి చేసుకొనే స్టీల్, అల్యూమినియంపై 25% టారిఫ్స్ విధిస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
ఇలా చేస్తే మీ ఆధార్ వివరాలు సేఫ్: UIDAI

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా కాపాడుకునేందుకు బయోమెట్రిక్ లాక్ చేసుకోవాలని UIDAI పేర్కొంది. దీనికోసం <
News July 11, 2025
జగన్ పర్యటన.. మొత్తం నాలుగు కేసులు నమోదు

AP: YS జగన్ చిత్తూరు(D) బంగారుపాళ్యం పర్యటనపై తాజాగా మరో కేసు నమోదైంది. అనుమతి లేకున్నా రోడ్షో చేపట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. పరిమితికి మించి జన సమీకరణ చేపట్టారని, రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు ఉల్లంఘించారని, ఫొటోగ్రాఫర్పై జరిగిన దాడి ఘటనపై 3 వేర్వేరు కేసులు పెట్టారు. CC ఫుటేజ్, వీడియోలను పరిశీలిస్తున్న పోలీసులు మరికొందరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.