News December 1, 2024
బియ్యం అక్రమ రవాణాలో నిజాల నిగ్గుతేల్చాలి: ద్వారంపూడి

AP: కాకినాడ పోర్టులో బియ్యం అక్రమ రవాణా విషయంలో మంత్రి నాదెండ్ల మనోహర్, MLA కొండబాబు తన పేరు ప్రస్తావించడంపై YCP నేత ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదన్నారు. Dy.CM పవన్ ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకుంటే కొండబాబు చరిత్ర తెలుస్తుందని చెప్పారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని, అధికారంలో ఉన్నవారు వాస్తవాల నిగ్గుతేల్చాలని సూచించారు.
Similar News
News January 28, 2026
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. రెండు విడతల్లో సమావేశాలను నిర్వహించనున్నారు. నేటి నుంచి FEB 13 వరకు తొలి విడత, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండో విడత సెషన్ జరగనుంది. మొత్తం 30 రోజులు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. నిన్న జరిగిన ఆల్ పార్టీ మీటింగ్లో MGNREGA, SIR, UGC నిబంధనలు తదితర అంశాలపై చర్చలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
News January 28, 2026
ప్రైవసీ ఉల్లంఘన ఆరోపణలు అవాస్తవం: వాట్సాప్

ప్రైవసీ ఉల్లంఘన <<18971131>>ఆరోపణలను<<>> WhatsApp మాతృసంస్థ Meta ఖండించింది. ‘మీ మెసేజ్లు ప్రైవేట్గానే ఉంటాయి. ఓపెన్ సోర్స్ సిగ్నల్ ప్రోటోకాల్తో ఎన్క్రిప్ట్ (హైడ్) చేస్తాం. మీ డివైజ్ నుంచి బయటకు వెళ్లే ముందే మెసేజ్లు ఎన్క్రిప్ట్ అవుతాయి. మీరు ఎవరికి పంపారో వాళ్లు మాత్రమే చదవగలరు. వాట్సాప్, మెటా వాటిని యాక్సెస్ చేయలేవు’ అని స్పష్టం చేసింది. కాగా Meta మెసేజ్లను చదవగలదని USలో దావా దాఖలవడంతో ఇలా స్పందించింది.
News January 28, 2026
T20 WC.. ఎవరైనా అప్సెట్ చేయొచ్చు: ద్రవిడ్

T20 WCలో భారత్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోందని మాజీ కోచ్ ద్రవిడ్ అన్నారు. ‘ఇండియా వేరే లెవెల్లో ఆడుతోంది. సెమీస్కు ఈజీగా చేరుకుంటుంది. కానీ నా గత అనుభవాలను బట్టి చెబుతున్నా. ఆ రోజున ఏ టీమ్ బాగా ఆడితే అదే గెలుస్తుంది. ఎవరో ఒకరు మంచి ఇన్నింగ్స్ ఆడి మిమ్మల్ని అప్సెట్ చేయొచ్చు’ అని పేర్కొన్నారు. ODI, T20ల్లో IND డామినెన్స్కు రోహిత్ శర్మ కారణమని ‘THE RISE OF THE HITMAN’ బుక్ లాంచ్ ఈవెంట్లో చెప్పారు.


