News February 14, 2026
TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్లో టీయూ విద్యార్థులు

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.
Similar News
News March 6, 2026
రేపు 11:01AMకి ‘ధురంధర్-2’ ట్రైలర్

ఆదిత్య ధర్, రణ్వీర్ సింగ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ధురంధర్-2’ సినిమా ట్రైలర్ రేపు ఉదయం 11.01 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. ఈసారి హిందీలోనే కాకుండా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలవనుంది. కాగా ‘ధురంధర్’ తొలి పార్ట్ ఏకంగా రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
News March 6, 2026
ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం కనకదుర్గానగర్ ప్రవేశద్వారం నుంచి పవిత్ర కలశాలతో అర్చకులు, వేదపండితులు ఇంద్రకీలాద్రికి చేరుకునే కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.
News March 6, 2026
HYDలోని మరో ఆఫీస్కు బాంబు బెదిరింపు

బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. 14 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం వరకు అవి పేలుతాయని ఈమెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన భవనం సురక్షితమని అధికారులు తేల్చారు. ఇటీవల వరుసగా కోర్టులకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.


